మద్రాసు హైకోర్టులో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది అని చెప్పుకునే వ్యక్తి తమిళనాడులో వ్యభిచార గృహం నడుపుతున్నందుకు భద్రత కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆగ్రహించిన న్యాయస్థానం పిటిషనర్కు జరిమానా విధించింది. కన్యాకుమారిలోని నాగర్కోయిల్లో పిటిషనర్ వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అతడిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించి వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నందుకు తమకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
READ MORE: Ashadha Masam: శుక్రవారం ఈ స్తోత్ర పారాయణం చేస్తే సిరిసంపదలు మీ వెంటే ఉంటాయి..
అయితే జస్టిస్ బి పుగలేంధీ ధర్మాసనం ఈ పిటిషన్ను తిరస్కరించింది. ప్రసిద్ధ న్యాయ కళాశాలల గ్రాడ్యుయేట్లకు మాత్రమే సభ్యత్వం ఇచ్చేలా బార్ కౌన్సిల్ను కోరింది. దీంతో పాటు పిటిషనర్కు రూ.10,000 జరిమానా కూడా విధించింది. లైవ్ లా నివేదిక ప్రకారం.. సమాజంలో న్యాయవాదుల ఖ్యాతి నిరంతరం క్షీణిస్తోందని బార్ కౌన్సిల్ గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని కోర్టు పేర్కొంది. బార్ కౌన్సిల్ కనీసం పేరున్న సంస్థల నుంచి పట్టభద్రులకు మాత్రమే సభ్యత్వం ఇచ్చేలా చూడాలని తెలిపింది.
READ MORE:Sri Lakshmi Stotram: లక్ష్మీ స్తోత్రాలు వింటే ఆ తల్లి మీ ఇంట కనకవర్షం కురిపిస్తుంది
తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని, తాను ట్రస్టును నడుపుతున్నానని, ఇందులో పెద్దల మధ్య అంగీకార సెక్స్పై కౌన్సెలింగ్, 18 ఏళ్లు పైబడిన వారికి ఆయిల్ బాత్ వంటి సేవలు అందిస్తున్నట్లు మురుగన్ పిటిషన్లో తెలిపారు. వ్యభిచార గృహం నిర్వహణలో పోలీసుల జోక్యాన్ని ఆపాలని ఆదేశించాలని కోరారు. దీనిపై హైకోర్టు మాట్లాడుతూ.. బుద్ధదేవ్ కేసులో సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తప్పుడు సందర్భంలో మురుగన్ అర్థం చేసుకున్నారని తెలిపింది. బుద్ధదేవ్ కేసు కింద సెక్స్ వర్కర్ల అక్రమ రవాణా, పునరావాసం నిరోధానికి సుప్రీం కోర్టు హామీ ఇచ్చిందని హైకోర్టు పేర్కొంది. ఈ పిటిషన్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు మురుగన్ న్యాయ విద్య మరియు బార్ అసోసియేషన్ సభ్యత్వాన్ని ధృవీకరించడానికి అతని ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్, లా డిగ్రీని సమర్పించాలని కోరింది.