Site icon NTV Telugu

Road Accident: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, 15 మందికి గాయాలు!

Road Accident

Road Accident

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రూరల్ మండలంలోని జాతీయ రహదారిలో నీలం జూట్ మిల్ దగ్గర ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సుతో సహా నాలుగు లారీలు ధ్వంసమయ్యారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: IPL 2025: నేటి నుంచే ఐపీఎల్‌ పునః ప్రారంభం.. ఆర్సీబీ, కేకేఆర్ మధ్య మ్యాచ్! కోహ్లీపైనే అందరి దృష్టి

బరంపురం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ట్రావెల్ బస్సును ఓ గ్రానైట్ లారీ ఢీట్టింది. దాంతో వెనకాలే ఉన్న మరో గ్రానైట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. సడన్ బ్రేక్ కారణంగా వెనుకనున్న లారీ క్యాబిన్‌పై ఓ గ్రానైట్ బ్లాక్ పడింది. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుని డ్రైవర్ మృతి చెందాడు. ఈ ఘటనలో మొత్తంగా బస్సుతో సహా నాలుగు లారీలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Exit mobile version