యంగ్ హీరో నితిన్ వరుస ప్లాపులతో బాగా వెనుకబడిపోయాడు. బీష్మ తర్వాత సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. దాంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న నితిన్ మరొక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా సోము, నర్రి అనే ఇద్దరు డెబ్యూ డైరెక్టర్లు టాలీవుడ్కు పరిచయం కాబోతున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
ఈ కొత్త చిత్రం మే 4వ తేదీన లాంఛనంగా ప్రారంభించి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మే 6వ తేదీ నుంచే రెగ్యులర్ షూటింగ్ను మొదలుపెట్టాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది. ప్రీ ప్లాన్ షెడ్యూల్ తో కేవలం 55 రోజుల్లోనే ఈ సినిమా పూర్తి షూటింగ్ను కంప్లీట్ చేయాలని మేకర్స్ టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే దాదాపు రెండు నెలల లోపే షూటింగ్ పార్ట్ అంతా పూర్తయిపోతుంది. నితిన్ కెరీర్లో ఇది వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రంలో నితిన్ సరసన కథానాయికగా రితికా నాయక్ నటించబోతున్నట్లు సమాచారం. ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో మెప్పించిన రితికాకు ఇది నితిన్తో ఫస్ట్ మూవీ. ఇక ఈ చిత్రానికి ‘విరాటపర్వం’ ఫేమ్ సురేష్ బొబ్బిలి సంగీతాన్ని అందించబోతున్నారు. మరో ఎన్నాళ్ళుగానో హిట్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నా నితిన్ కు డెబ్యూ డైరెక్టర్స్ హిట్ ఇస్తారో లేదో చూడాలి.
