Site icon NTV Telugu

Gallantry Awards For 2026: భారత వైమానిక దళ గర్వకారణం.. శుభాన్షు శుక్లాను వరించిన అశోక్ చక్ర!

Shubhanshu Shukla

Shubhanshu Shukla

Gallantry Awards For 2026: గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)ను సందర్శించిన భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్ శుంభాషు శుక్లాకు అశోక చక్ర అవార్డు వరించింది. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 70 మంది సాయుధ దళాల సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం శౌర్య పురస్కారాలను ప్రకటించింది. వీటిలో ఆరు మరణానంతర అవార్డులు ఉన్నాయి. కేంద్రం ప్రకటించిన ఈ 70 అవార్డుల్లో ఒక అశోక చక్ర, మూడు కీర్తి చక్రాలు, 13 శౌర్య చక్రాలు, ఒక మరణానంతర అవార్డుతో సహా, ఒక బార్ టు సేన మెడల్ (శౌర్యం), 44 సేన మెడల్స్ (శౌర్యం), ఐదు మరణానంతరం సహా, ఆరు నవో సేన మెడల్స్ (శౌర్యం), రెండు వాయు సేన మెడల్స్ (శౌర్యం) ఉన్నాయి.

READ ALSO: Bangladesh: షేక్ హసీనా ప్రసంగం.. భారత్‌పై బంగ్లాదేశ్ తీవ్ర ఆగ్రహం..

2026లో శౌర్య పురస్కార గ్రహీతల జాబితా ఇదే..
అస్సాం రైఫిల్స్‌కు చెందిన అర్ష్‌దీప్ సింగ్, నాయబ్ సుబేదార్ దోలేశ్వర్ సుబ్బా, వైమానిక దళానికి చెందిన ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌లను కీర్తి చక్ర అవార్డు గ్రహీతలుగా ప్రకటించారు. దేశాన్ని కాపాడటంలో అత్యుత్తమ పరాక్రమం ప్రదర్శించే సైనిక సిబ్బందికి ఏటా శౌర్య పురస్కారాలను ప్రదానం చేస్తారు. శౌర్య పురస్కారాలతో పాటు ఆదివారం పద్మ అవార్డులను కూడా కేంద్రం ప్రకటించింది. 2026 సంవత్సరానికి రాష్ట్రపతి 131 పద్మ అవార్డుల ప్రదానోత్సవాన్ని ఆమోదించారు. ఈ జాబితాలో ఐదుగురు పద్మ విభూషణ్, 13 మంది పద్మ భూషణ్, 113 మంది పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఉన్నారు.

READ ALSO: Padma Awards 2026: రోహిత్ శర్మ ఖాతాలో మరో అరుదైన గౌరవం.. హిట్ మ్యాన్‌ను వరించిన పద్మశ్రీ!

Exit mobile version