మహారాష్ట్ర నాసిక్లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో స్థానికంగా కలకలం రేపింది. పిల్లల తల్లిదండ్రులు విద్యార్థులంతా ఆందోళనకు గురయ్యారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర నాసిక్లోని ఒక ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఇందిరానగర్ పోలీస్ స్టేషన్కు తెల్లవారుజామున 2.45 గంటలకు నకిలీ ఇమెయిల్ చిరునామా నుండి బెదిరింపు ఇమెయిల్ వచ్చిందని ఇన్స్పెక్టర్ త్రిప్తి సోనావానే తెలిపారు. వాడా పత్రి రోడ్లోని నాసిక్ కేంబ్రిడ్జ్ హై స్కూల్ బాత్రూంలో బాంబు ఉందని అందులో పేర్కొన్నారు.
పాఠశాల పరిపాలన సమాచారం మేరకు, పోలీసులు బాంబు స్క్వాడ్కు ఫోన్ చేసి ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలను (SOP) అనుసరించి సమగ్ర దర్యాప్తు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా అనుమానాస్పద వస్తువు ఏదీ కనపడలేదని తెలిపారు. పాఠశాలకు ఎలాంటి ప్రమాదం లేదని… సురక్షితంగా ఉందని పోలీసులు నిర్థారించుకున్నారు. ఎవరో కావాలనే మెయిల్ పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మెయిల్ పంపిన వారిని గుర్తించేందుకు సైబర్ అధికారుల సహాయం తీసుకుంటున్నామని వెల్లడించారు.
