Earthquake: మహారాష్ట్ర నాసిక్‌లో భూకంపం…

  • మహారాష్ట్ర నాసిక్‌లో 3.8 తీవ్రతతో భూకంపం.
  • తెల్లవారుజామున 2:30 గంటలకు నమోదైన ప్రకంపనలు.
  • భూకంప కేంద్రం 5 కి.మీ లోతులో ఉన్నట్లు ఎన్‌సీఎస్ వెల్లడి.
Earthquake

Earthquake

Earthquake: మహారాష్ట్ర నాసిక్‌లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. 3.8 తీవ్రతతో తెల్లవారుజామున 2.30 గంటలకు ప్రకంపలను వచ్చాయి. 5 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) తెలిపింది.

భూకంప తీవ్రత తక్కువగా ఉండటం వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా పెద్ద నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. అయితే, ఈ ప్రకంపన స్థానిక నివాసితులలో భయాందోళనలను సృష్టించింది, మరియు చాలా మంది తమ ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని అధికారులు కోరారు. 3.8 తీవ్రత గల భూకంపం తేలికపాటిదే అయినప్పటికీ, ఆ ప్రాంతం భూకంపాలకు గురయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్త వహించాలని భూకంప శాస్త్రవేత్తలు చెబుతున్నారు.