Bihar : బీహార్లోని ముజఫర్పూర్లో ఓ మహిళ ప్రేమలో మోసపోయిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తొలిప్రేమ, ఆ తర్వాత లైగింక వాంఛ, ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకున్న 20 రోజులకే ఆ యువకుడు భార్యను వదిలి పారిపోయాడు. పెళ్లయి చాలా రోజులైనా అతడు కనిపించకపోవడంతో భార్య అతని కోసం తీవ్రంగా వెతికింది. అయినా తన భర్త ఆచూకీ లభించలేదు.
ఒక రోజు గది లోపల ఉంచిన అల్మారా చూడగానే ఒక్కసారిగా షాక్ తిన్నది. అక్కడ నుంచి వివాహ ధ్రువీకరణ పత్రం, ఇతర పత్రాలు కనిపించలేదు. అప్పుడు తన భర్త మోసం చేసిన విషయం ఆమెకు అర్థమైంది. విషయం ముజఫర్పూర్లోని సికందర్పూర్కు చెందినది. తనకు న్యాయం చేయాలంటూ నవ వధువు మహిళా పోలీస్ స్టేషన్కు చేరుకుని భర్త, అత్త పై ఫిర్యాదు చేసింది. మహిళా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
Read Also:Vote Ink Mark: మహిళకు తలనొప్పిగా మారిన ఇంక్ మార్క్.. తొమ్మిదేళ్లు గడుస్తున్న చెరగని సిరా గుర్తు..
రెండేళ్ల క్రితం ఆ యువకుడిని కలిశానని బాధితురాలు జాన్వీ గుప్తా తెలిపింది. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. మొబైల్లో ఒకరితో ఒకరు చాటింగ్ చేయడం మొదలుపెట్టారు. తర్వాత ఇద్దరూ గంటల తరబడి మొబైల్లో మాట్లాడుకునేవారు. ఇద్దరికీ సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ ఒకరికొకరు చాలా సమయం ఇవ్వడం ప్రారంభించుకున్నారు. దగ్గరైన తర్వాత ఆ స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో తెలియలేదు. ప్రేమ ఎంతగా పెరిగిందంటే ఇద్దరూ రహస్యంగా కలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వ్యక్తిగత సంబంధం ఏర్పడింది. ఆమె పెళ్లికి ముందే గర్భం దాల్చిందని, ఆమె రెండుసార్లు గర్భవతి అయినప్పుడు, ఆదిత్య ఆమెకు అబార్షన్ చేయించాడని మహిళ వాపోయింది. మత్తు పదార్థాలు కలిపి తాగించి.. ఆ తర్వాత ఆమెతో సెక్స్లో పాల్గొనేవాడని జాన్వీ చెప్పింది..
పెళ్లి చేసుకోవాలని బాధితురాలు ఒత్తిడి చేయడంతో ప్రేమికుడు నగరంలోని రాణి సతీ ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరూ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. పెళ్లయ్యాక భర్తతో కలిసి అత్తమామల ఇంటికి చేరుకుంది. వివాహ ధృవీకరణ పత్రం కోసం ఆమె రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తును కూడా సమర్పించింది. అయితే ఆమె తన అత్తమామల ఇంటికి చేరుకోగానే, ఆమె అత్తగారు, ఆడపడుచు ఆమెను కొట్టడం, తిట్టడం మొదలు పెట్టారు.
Read Also:Rajasthan: అంత్యక్రియలకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. కారును ఢీకొట్టిన ట్రక్కు, ముగ్గురు మృతి
మంగళసూత్రం, సూట్కేస్ను ఉంచుకుని బెదిరింపులతో ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. భర్త అహియాపూర్లోని డాక్టర్ కాలనీలో అద్దెకు ఇల్లు తీసుకుని ఇద్దరూ జీవనం ప్రారంభించారు. ఇంతలో ఆదిత్య ఆఫీస్ కి వెళుతున్నానని చెప్పి తిరిగి రాలేదు. ఆదిత్యకు ఫోన్ చేయగా తీయలేదు. ఆదిత్య తప్పించుకున్న తర్వాత, అతని తల్లి అహియాపూర్ పోలీస్ స్టేషన్లో జాన్వీపై తన కొడుకును కిడ్నాప్ చేసినట్లు కేసు పెట్టింది. జాన్వీ ఆదిత్యపై మే 10న మహిళా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. మహిళా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ మొత్తం కేసు దర్యాప్తు ప్రారంభించారు.
