MP Mithun Reddy: లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి రిమాండ్..

Mp

Mp

మద్యం కుంభకోణం కేసులో ఏ4గా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్‌ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ఏసీబీ కోర్టు మిథున్‌రెడ్డికి రిమాండ్ విధించింది. ఆగస్టు ఒకటి వరకు రిమాండ్ విధించింది. కాసేపట్లో మిథున్ రెడ్డిని పోలీసులు రాజమండ్రి జైలుకి తరలించనున్నారు. అంతకు ముందు సిట్‌ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీపీ, షుగర్‌, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని నిర్ధరించడంతో ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరు పర్చారు. మిథున్‌రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్‌ కోర్టుకు నివేదించింది. సెక్షన్‌ 409, 420, 120(బీ), రెడ్‌విత్‌ 34, 37, ప్రివెన్షన్‌ ఆప్‌ కరెప్షన్‌ యాక్టు 7, 7ఏ, 8, 13(1)(బీ), 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపింది.

READ MORE: Tamil Nadu: భార్యపై దాడి చేసి, ఆస్పత్రిలో ఉన్నా కనికరం లేకుండా దారుణహత్య..