మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం లో ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు కొందరు వ్యక్తులు. ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ చేతిలో అడ్డంగా బుక్కయ్యారు. ఎమ్మెల్యే రామచంద్రునాయక్ కౌసల్యదేవిపల్లికి వెళ్తున్న క్రమంలో ఆకేరువాగు బ్రిడ్జీ వద్ద కాన్వాయి ఆపి, ఇసుక ట్రాక్టర్లకు జారీ చేసిన కూపన్లను పరిశీలించారు. ఇసుక ఎక్కడకు తరలిస్తున్నారని ట్రాక్టర్ డ్రైవర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కూపన్ ఒక చోట ఇసుక తరలింపు మరొక చోట కు ఉండడంతో ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ తహసీల్దార్ రమేష్ బాబును పిలిపించి ఇసుక కూపన్ల జారీ రికార్డులను పరిశీలించి ఎమ్మార్వో పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సింహులపేట మండలంలో ఆకేరు వాగు పరివాహకంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ఎస్సై, రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
MLA Ramachandru Naik: నర్సింహులపేట మండలం లో ఇసుక అక్రమ రవాణా.. రంగంలోకి ఎమ్మెల్యే రామచంద్రు నాయక్
- నర్సింహులపేట మండలం లో ఇసుక అక్రమ రవాణా
- అడ్డుకున్న ఎమ్మెల్యే రామచంద్రు నాయక్
- ఆకేరు వాగు పరివాహకంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేయాలని ఎస్సై, రెవెన్యూ అధికారులకు ఆదేశం

Mla Ramchandru Naik