NTV Telugu Site icon

Uday Pratap Singh: మొహర్రం వరకు ఎమ్మెల్యే ‘రాజా భయ్యా’ తండ్రి హౌస్ అరెస్ట్..

Raja Bayya

Raja Bayya

జనసత్తా దళ్ (లోక్తాంత్రిక్) అధ్యక్షుడు, కుంట ఎమ్మెల్యే రఘురాజ్ ప్రతాప్ సింగ్ తండ్రి ఉదయ్ ప్రతాప్ సింగ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నగరంలో శాంతియుతంగా ముహర్రం నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం గృహనిర్బంధంలో ఉంచినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ప్రతి సంవత్సరం మొహర్రం సందర్భంగా వ్యతిరేకతతో ప్రతాప్ సింగ్ ను గృహనిర్బంధంలో ఉంచుతారు. ఈసారి కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Rakul Preet Singh: డ్రగ్స్ కేసులో తమ్ముడు అరెస్ట్.. ఆ ఫోటోలు షేర్ చేసిన రకుల్

అయితే కొన్నేళ్ల కిందట షేక్‌పూర్ ఆషిక్‌లోని మొహర్రం ఊరేగింపు సందర్భంగా కోతి మరణించింది. కోతి చనిపోయిన వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే రాజా భయ్యా తండ్రి ఉదయ్ ప్రతాప్ సింగ్‌, ఆయన మద్దతుదారులు మొహర్రం రోజున విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉదయ్ ప్రతాప్ సింగ్ చాలా సంవత్సరాలుగా మొహర్రం రోజున కుంటలోని ప్రయాగ్‌రాజ్-లక్నో హైవేలోని శేష్‌పూర్ గ్రామంలో రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నిస్తున్నాడు. దీంతో పరిపాలన యంత్రాంగం భారీ పోలీసు బలగాలను మోహరించి ముహర్రం ఊరేగింపు నిర్వహించాల్సి వచ్చేది. అయితే.. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ముందు జాగ్రత్త చర్యగా.. ఉదయ్ ప్రతాప్ సింగ్‌ను గృహనిర్బంధంలో ఉంచారు.

Ariyana: రాజ్ తరుణ్ ప్రియురాలు ఆరోపణలు.. క్లీవేజ్ అందాలతో అరియనా బిగ్ ట్రీట్!

మరోవైపు.. మొహర్రం దృష్ట్యా ప్రతాప్‌గఢ్ డీఎం, ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎలాంటి మత ఉద్రిక్తతలు పెంచవద్దని సూచించారు. కాగా.. పోలీసులు భారీ బలగాలతో భద్రి కోఠికి చేరుకుని అక్కడ ఉదయ్ ప్రతాప్ సింగ్‌ను అరెస్టు చేశారు. ఈసారి ఉదయ్ ప్రతాప్‌ను మూడు రోజుల పాటు గృహనిర్బంధంలో ఉంచనున్నారు. మందిరం గేటు వద్ద పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు.