Konda Surekha: విభజించి పాలించే మనస్తత్వం ఉన్న పార్టీ బీజేపీ.. కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు
- బీజేపీపై మంత్రి ఘాటు వ్యాఖ్యలు
- విభజించి పాలించే మనస్తత్వం బీజేపీదన్న కొండా సురేఖ
- . అది ఓ మతతత్వ పార్టీ అని వ్యాఖ్యానించిన మంత్రి
- అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ ఎప్పుడు పాటుపడలేదని ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభజించి పాలించే మనస్తత్వం బీజేపీదని.. అది ఓ మతతత్వ పార్టీ అని మంత్రి కొండా సురేఖ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీ బీజేపీ అని విమర్శించారు. ప్రజల అవసరాల కోసం ప్రజల అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ ఎప్పుడు పాటుపడలేదని ఆరోపించారు. బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ కులంపై ప్రశ్నిస్తున్నారని… ఆ పార్టీ నాయకులు కుల గణన ఫామ్ తీసుకుని రాహుల్ గాంధి ఇంటికి వెళ్తే.. రాహుల్ గాంధీ కులం ఏంటో అడిగితే ఆయనే చెబుతారన్నారు. గత పది సంవత్సరాలలో ప్రజలకు సమస్య చెప్పుకునే వేదిక కూడా ఉండేది కాదని మంత్రి తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు పరిపాలన అందిస్తోందన్నారు. ఎన్నికల ముందు ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతామని హామీ ఇచ్చామని.. ప్రగతి ఉన్నచోట ప్రజాపాలన కొనసాగుతోందని చెప్పారు.
READ MORE: AP Drone Policy: డ్రోన్ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే..
Also Read
- LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
- Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
- NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
- Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
కొత్త పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ వచ్చాక గాంధీ భవన్లో కార్యకర్తల కోసం, ప్రజల కోసం మంత్రుల ముఖాముఖి ఏర్పాటు చేయాలని కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. గాంధీభవన్లో మంత్రితో ముఖాముఖి మంచి సంప్రదాయం ఇది ఎప్పటికీ కొనసాగుతుందన్నారు. కుల గణన అంశంలో ప్రజల్లో సైతం మంచి స్పందన వచ్చిందని.. ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. కుల గణన బ్రిటిష్ కాలంలో జరిగిందని.. ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు ఇప్పుడు సర్వే చేపడుతున్నామని స్పష్టం చేశారు. విశ్వంలో ఎక్కడా లేని విధంగా మన దగ్గరే కుల వివక్ష ఉందని రాహుల్ మాట్లాడారన్నారు. సామాజిక న్యాయం జరగడంలో తెలంగాణ రోల్ మోడల్ గా ఉండాలని తెలిపారు. 25 రోజుల లోపల కుల గణన సంపూర్ణంగా పూర్తి అవుతుందని.. ప్రతి ఇంటిలో ఏ కులం వారు ఎంత ఉన్నారో 56 ప్రశ్నలతో రిపోర్ట్ సిద్ధం చేస్తున్నామన్నారు. కుల గణన పూర్తయిన తర్వాత వాటి రిపోర్టు ఆధారంగా ఏ విధంగా సామాజిక న్యాయం చేయాలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అవినీతివాళ్ళ కలలో కనిపిస్తున్నాయి కావచ్చు అందుకే వాటి గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు.
తాజావార్తలు
-
LayOffs: స్టార్బక్స్లో మళ్లీ ఉద్యోగుల తొలగింపు.. 300 మంది కార్పొరేట్ స్టాఫ్పై వేటు.. కొన్ని ఆఫీసుల మూసివేత..
-
Foreign Travels: విదేశీ టూర్లపై భారీగా ట్యాక్స్ వేసేందుకు రంగం సిద్ధం! కేంద్రం ప్లాన్ ఇదేనా?
-
NEET-UG 2026 paper leak: నీట్ పేపర్ లీక్ను ఛేదించిన సీబీఐ.. అసలు సూత్రధారి కెమిస్ట్రీ లెక్చరర్..
-
Viral Suit Chef: రోడ్డు పక్కన ఫ్రైడ్ రైస్ అమ్ముతూ నెల రూ.7 లక్షలు సంపాదిస్తున్న 19 ఏళ్ల కుర్రాడు..
-
Chennai: టెక్ మహీంద్రా కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో ఆఫీస్ దగ్ధం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!