Site icon NTV Telugu

Death Threats : షాపూర్‌నగర్‌లో మావోయిస్టుల పేరుతో లేఖ కలకలం

Maoists

Maoists

Death Threats : హైదరాబాద్ శివారులోని షాపూర్‌నగర్‌లో మావోయిస్టు పేరుతో వచ్చిన బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. ప్రముఖ రాజకీయ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న ఈ లేఖ ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది. ఇంటి ముందు తులసి మొక్కను ధ్వంసం చేసి, కారుపై బెదిరింపు లేఖ ఉంచిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. షాపూర్‌నగర్‌కు చెందిన కూన రవీందర్ గౌడ్ కుమారుడు రాఘవేందర్ గౌడ్‌ను చంపుతామని గుర్తుతెలియని వ్యక్తి లేఖలో హెచ్చరించాడు. రాఘవేందర్ గౌడ్, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ సోదరుని కుమారుడు కావడం గమనార్హం. రూ. 50 లక్షలు ఇవ్వకపోతే, ఇంటి ముందు తులసి మొక్కను ధ్వంసం చేసిన విధంగా నీ కుమారుడిని కూడా చంపుతానంటూ ఆ లేఖలో స్పష్టంగా పేర్కొన్నాడు.

Emirates Draw : లాటరీలో 231 కోట్ల జాక్‌పాట్.. రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తిన చెన్నై వ్యక్తి..!

ఈ నెల 21న చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి, సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు ఓ మాస్క్ ధరించిన వ్యక్తిని గుర్తించారు. ఎరుపు రంగు టవల్‌లో లేఖను చుట్టి, కారుపై ఉంచిన విధానం దుండగుడి ప్రణాళికాత్మక చర్యగా భావిస్తున్నారు. ఈ ఘటనపై రాఘవేందర్ గౌడ్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. విషయం దర్యాప్తు నిమిత్తం గోప్యంగా ఉంచిన పోలీసులు, మావోయిస్టు ముద్ర వేసి బెదిరింపు ఇచ్చే దిశలో వెనకున్న అసలైన ఉద్దేశ్యాలపై స్పష్టతకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక వ్యక్తిగత పగ వెనుక ఉన్నదా? లేక వాస్తవంగా మావోయిస్టుల ప్రమేయమా అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనతో ప్రజల్లో భయాందోళన నెలకొనగా, రాజకీయ కుటుంబాలను లక్ష్యంగా చేసుకున్న బెదిరింపులపై పోలీసుల అప్రమత్తత అవసరం మరింతగా గుర్తు చేసుకుంది.

Mahanadu 2025: కడపలో ప్రారంభమైన టీడీపీ మహానాడు.. రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న సీఎం చంద్రబాబు!

Exit mobile version