Site icon NTV Telugu

Matangeswara Temple : సైన్స్ కు కూడా అందని అద్భుతాలు.. ఏడాదికొకసారి పెరుగుతున్న లింగం…

Matngi

Matngi

ఉజ్జయిని మహంకాళేశ్వరుడి ఆలయం గురించి అందరు వినే ఉంటారు.. ఎంతో మహిమన్విత ఆలయం ఇది.. ఈ ఆలయం మధ్యప్రదేశ్లో కొలువై ఉంది.. ఈ రాష్ట్రంలో ఇలాంటి ఎన్నో ప్రసిద్ద ఆలయాలు ఉన్నాయి. పురాతనమైన ఆలయాలకు నిలయం.. ఖజురహో దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇప్పటికీ ఈ దేవాలయాల్లో పూజలను నిర్వహిస్తున్నారు. ఖజురహోలో ఉన్న ఒక ఆలయంలో రహస్యం దాగుతుంది. ఇప్పటికి ఆ రహస్యం గురించి ఎవరికీ అంతుచిక్కడం లేదు.. ఇప్పుడు మరో ఆలయం మిస్టరీగానే మిగిలింది..

మనదేశంలో ఎన్నో అద్భుతమైన శివలింగాలు ఉన్నాయి.. మాతంగేశ్వర ఆలయ రహస్యం చాలా ప్రత్యేకమైనది. అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.. కానీ ఈ ఆలయంలో ఉన్న శివలింగంకు ప్రత్యేకమైన శక్తి ఉందని ప్రజలు నమ్ముతారు. అంటే శివలింగంకు ప్రాణం ఉందని ప్రజలు చెబుతుంటారు.. అందుకే ప్రతి ఏడాది పౌర్ణమికి లింగం పెరుగుతూ వస్తుంది. ఇప్పటికి దాదాపు 9 అడుగులకు చేరుకుంది. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలోని శరత్ పూర్ణిమ రోజున దీని పొడవు పెరుగుతుందని అక్కడి భక్తులు చెబుతున్నారు..

పురాణాల ప్రకారం.. ఈశ్వరుడి వచ్చ పచ్చల రత్నం ఉందట. దానిని శివుడు పాండవుల్లో అగ్రజుడు యుధిష్ఠిరునికి ఇచ్చాడు. అనంతరంయుధిష్ఠిరుడి ఆ రత్నాన్ని మాతంగ మహర్షికి ఇచ్చాడు.. ఆ తర్వాత ఆ రత్నం ఒక మహర్షి చేతికి చిక్కుతుంది. రత్నాన్ని భద్ర పరచడానికి ఈ శివలింగం మధ్య భూమిలో పాతి పెట్టాడు.. అప్పటి నుంచి ఆ రత్నం లింగం కిందే ఉందని చెబుతున్నారు.. అందుకే లింగం కూడా పెరుగుతుంది.. జీవం ఉన్న లింగంలా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.. కానీ సైన్స్ కు కూడా అందని ఏదో మిస్టరీ ఉందని నిపుణులు చెబుతున్నారు… అదేంటో ఇప్పటికి కనుక్కోలేక పోతున్నారు..

Exit mobile version