NTV Telugu Site icon

Breaking News: ఫైనల్లో మను భాకర్ ఓటమి..

Manu Bhaker

Manu Bhaker

పారిస్ ఒలింపిక్స్లో భారత్ మరో పతకాన్ని కోల్పోయింది. భారత స్టార్ షూటర్ మను భాకర్ మరో పతకం తృటిలో చేజారింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలవడంతో.. ఓటమి పాలయ్యారు. హోరా హోరీగా సాగిన పోరులో అద్భుతంగా రాణించిన మను.. 4వ స్థానంలో నిలవడంతో పోటీ నుంచి ఎలిమినేట్ అయింది. టాప్-3 లో ఉంటే పతకం వచ్చేది. ఈ పోటీలో మొత్తం 10 సిరీస్ షాట్లు కాల్చాల్సి ఉంది. ఒక సిరీస్‌లో మొత్తం ఐదు షాట్లు ఉన్నాయి. మూడు సిరీస్‌ల తర్వాత ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభమైంది. కాగా.. ఒలింపిక్స్‌లో ఆమె ఇప్పటికే రెండు కాంస్య పతకాలు సాధించిన విషయం తెలిసిందే..