ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన అవినీతి కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశే ఎదురైంది. ఆయనకు జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. సీబీఐ, ఈడీ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని జూలై 22 వరకు పొడిగించారు. కాగా.. నేటికి జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు.
Manish Sisodia: మనీష్ సిసోడియాకు నిరాశ.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- మనీష్ సిసోడియాకు మరోసారి నిరాశ
- జ్యుడీషియల్ కస్టడీని పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
- జూలై 22 వరకు పొడిగింపు.
![Manish Sisodia](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/07/Manish-Sisodia-1024x576.jpg)
Manish Sisodia