Illicit Relationship: ప్రియుడితో వెళ్లిపోయిన ముగ్గురు పిల్లల తల్లి.. భార్య మీద కోపంతో పిల్లల్ని హత్య చేసిన తండ్రి
- ప్రియుడితో వెళ్లిపోయిన ముగ్గురు పిల్లల తల్లి
- భార్య మీద కోపంతో పిల్లల్ని హత్య చేసిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా కుటుంబాలను, జీవితాలను చిన్నాభిన్నం చేస్తో్ంది. సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమగా మారి ఏకంగా భర్త పిల్లలను కూడా వదిలేసి ప్రియుడితో పరారవుతున్నారు పలువురు మహిళలు. తాజాగా తమిళనాడులో ఘోరం చోటుచేసుకుంది. ఓ మహిళ ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. విషయం తెలిసిన భర్త పిల్లలకోసమైన తిరిగి రావాలని ప్రాధేయపడ్డాడు. కానీ ఆమె తిరిగి రాలేదు. దీంతో మానసిక వేదనకు గురై క్షణికావేశంలో ముగ్గురు పిల్లలను చంపేశాడు తండ్రి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read:Off The Record : ఆ జిల్లాలో ఉన్నదే ముగ్గురు ఎమ్మెల్యేలు, రెండు వర్గాలయ్యారా..?
Also Read
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
- UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
భార్య ప్రియుడితో వెళ్లిపోయిందనే ఆగ్రహంతో అల్లారు ముద్దుగా పెంచిన ముగ్గురు పిల్లలను ఓ తండ్రి హతమార్చిన దారుణమైన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.. తమిళ నాడు రాష్ట్రం తంజావూరు జిల్లా గోపాల సముద్రం ప్రాంతంలో వినోద్ కుమార్, నిత్య అనే దంపతులు నివసి స్తున్నారు. వీరికి ఓవియా (12), కీర్తి (8) అనే కుమా ర్తెలు, ఈశ్వరన్ (5) అనే కుమారుడు ఉన్నారు. ఇటీవల నిత్యకు సామాజిక మాధ్యమాల ద్వారా తిరువారూర్ జిల్లా మన్నార్ గుడికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్ప డింది.
Also Read:Vasudevasutam Teaser : ఈ కథ శ్రీ కృష్ణుడిదే కాదు..ఓ యువకుడిది!
పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. ఆరునెలల ముందు నిత్య భర్త, పిల్లలను విడిచిపెట్టి ఆ యువకుడితో వెళ్లిపోయింది. అయితే నిత్యను వినోద్ కుమార్ కలుసుకుని పిల్లల భవిష్యత్తు దృష్ట్యా ప్రియుడిని విడిచిపెట్టి రమ్మని కోరాడు. కానీ ఆమె తన పట్టును సడలించలేదు. దీంతో భార్యపై ఉన్న ఆగ్రహాన్ని తన ముగ్గురు పిల్లలపై చూపించాడు. శుక్ర వారం సాయంత్రం తన ఇంట్లో ఓ గదిలో పిల్లలు ముగ్గురిని బంధించి స్వీట్లు తినాలని చెప్పాడు పిల్లలు స్వీట్లు తింటుండగానే కత్తితో దాడి జరిపి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. పోలీ సులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
తాజావార్తలు
-
Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
-
XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
-
Vijay-Trisha: త్రిష ప్లేస్లో నేనుంటేనా.. విజయ్ను వదిలేసి దూరంగా వెళ్లిపోయేదాన్ని: సీనియర్ హీరోయిన్
-
UAPA: షహజాద్ భట్టి నెట్వర్క్పై భారత్ ఉక్కుపాదం.. ఉగ్రసంస్థగా ప్రకటన..
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!