అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్వీఎస్ ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగలు, అగ్ని మంటలు అలుముకోడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు కార్మికులు. కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బంది భయాందోళనతో పరుగులు తీశారు. సాల్వెంట్ ద్రావకం మిక్స్ చేస్తున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు కంపెనీ యాజమాన్యం.
Also Read: Donald Trump: వెనిజులా దాడి అచ్చం “టీవీ షో”లా ఉంది, ఒక్క సైనికుడు మరణించలేదు..
ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం 8 ఫైర్ ఇంజన్లు ఎస్వీఎస్ ఫార్మా కంపెనీ వద్దకు చేరుకున్నాయి. ఫార్మా ప్రమాద ఘటనలో కార్మికులు, సిబ్బందికి ఎటువంటి హాని జరగలేదని యాజమాన్యం తెలిపింది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై హోం మంత్రి అనిత జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి ఆరా తీశారు.
