Site icon NTV Telugu

Road Accident: లండన్‌ రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థులు మృతి.. ఐదుగురికి గాయాలు!

London Road Accident

London Road Accident

లండన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. వినాయక నిమజ్జనానికి వెళ్లి.. తిరిగి వస్తుండగా రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ వాసులు నాదర్‌గుల్‌కు చెందిన తర్రె చైతన్య యాదవ్ (23), ఉప్పల్‌కు చెందిన రిషి తేజ (21) అక్కడిక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గురైన వారందరూ తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే.

Also Read: Kaleshwaram Project: కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపండని కేంద్రకు లేఖ.. వాట్ నెక్స్ట్!

హైదరాబాద్‌లోని నాదర్‌ గుల్‌కు చెందిన తర్రె ఐలయ్య, మంగమ్మ దంపతుల చిన్న కుమారుడు చైతన్య యాదవ్. ఇక్కడ బీటెక్‌ పూర్తి చేసిన చైతన్య.. ఎంఎస్ కోసం 7 నెలల కిందట లండన్‌ వెళ్లాడు. లండన్‌లో వినాయక ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుని.. 8 మంది స్నేహితులతో రెండు కార్లలో నిమజ్జనానికి వెళ్లారు. నిమజ్జనం అనంతరం తిరిగి వస్తుండగా రెండు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చైతన్య, రిషి తేజ మృతి చెందారు. ప్రమాదం గురించి సోమవారం రాత్రి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. చైతన్య, రిషి తేజ మృతితో వారి కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version