ఈమధ్య ప్రముఖ ఐటి కంపెనీలు ఆర్థిక పరిస్థితుల నుంచి బయట పడేందుకు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నారు.. అమెరికా టెక్ కంపెనీలు మెటా, ట్విటర్, గూగుల్ వంటివి ఉద్యోగులను పెద్ద సంఖ్యలో తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.. ఇప్పటికే ప్రముఖ కంపెనీలు వేల మందిని ఇంటికి పంపించింది.. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్ లోకి మరో దిగ్గజ కంపెనీ వచ్చి చేరింది..
గత ఏడాది ఈ తొలగింపులు ఎక్కువ అయ్యాయి.. 2023 లో దాదాపు 14,418 మందికి వివిధ సంస్థలు ఉద్వాసన పలికినట్లు ఈ నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఈ సంఖ్య 14,224 గా ఉంది. 2024లో కూడా అదే తంతు కొనసాగుతుంది.. ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ 1000 మంది ఉద్యోగులును తొలిగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఈబే లేఆఫ్ ప్రకటించింది. వెయ్యి మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఇక ముందు కూడా ఉద్యోగులను భారీగా తొలగించవచ్చు అని ప్రకటించింది..
ప్రస్తుతం లాభాలను పొందుతున్నప్పటికి వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. తొలగింపు విషయాన్ని ఇ-మెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేసింది. కంపెనీ లక్ష్యాలకు వ్యతిరేకంగా పరిస్థితులు మారినప్పుడు వ్యాపార వృద్ధిని మించి ఉద్యోగులు, ఖర్చులు ఉంటాయి.. అందుకే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొంది..