కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ అంబర్పేట్, బాగ్ అంబర్పేట్ డివిజన్ లలో పర్యటించారు. సంభంధిత అధికారులను వెంటపెట్టుకొని పర్యటించిన కిషన్ రెడ్డి గారు మొదట అంబర్పేట్ డివిజన్ పటేల్ నగర్ చౌరస్తాలో స్థానిక ప్రజలతో కాసేపు ముచ్చటించారు ప్రజల నుంచి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికారులతో కలిసి అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు తర్వాత అక్కడే ఉన్న పటేల్ నగర్ గోశాల లో పశువుల సేవలో గడిపారు అనంతరం ప్రేమ్ నగర్ బస్తిలో పర్యటించారు ప్రజలతో మాట్లాడారు వారి సమస్యలు విన్న కిషన్ రెడ్డి వారితో కాసేపు మాట్లాడారు బస్తీల్లో పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను కోరారు. అనంతరం బాగ్ అంబర్పేట్ డివిజన్ లోని పలు కాలనీల్లో ప్రజలతో కలిసి తిరుగుతూ అభివృద్ధి పనులను పర్యవేక్షించారు పనుల పురోగతిపై అధికారులను త్వరతగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలు మంత్రి దృష్టికి తెచ్చిన పలు సమస్యలను పూర్తి చేయాలని సంభంధిత అధికారులను కోరారు.
Kishan Reddy : అంబర్పేట్, బాగ్ అంబర్పేట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన
![Kishan Reddy](https://d2zfbyesi0qka0.cloudfront.net/wp-content/uploads/2024/07/kishan-reddy-1-1024x576.jpg)
Kishan Reddy