జపాన్కు చెందిన మూన్ మిషన్ స్నిపర్ ఈరోజు చంద్రుడి ఉపరితలంపై దిగబోతోంది. ఈరోజు రాత్రి 9 గంటలకు చంద్రుడి ఉపరితలంపై స్నిపర్ ల్యాండ్ కానుందని జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా తెలిపింది. కాగా, భారత్ విజయవంతంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ లాగానే ప్రస్తుతం ప్రపంచం మొత్తం దృష్టి జపాన్ స్నిపర్ మిషన్ పైనే ఉంది. వాస్తవానికి, జపాన్ స్పేస్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. దాని ల్యాండింగ్ ప్రక్రియ 20 నిమిషాలు పడుతుంది. ఈరోజు జపాన్ మిషన్ విజయవంతమైతే, 1966 తర్వాత చంద్రుడిపై దిగిన ఐదవ దేశంగా జపాన్ అవతరిస్తుంది. స్నిపర్ మిషన్ డిసెంబరు 25న చంద్రుని కక్ష్యకు చేరుకున్నాడని.. అప్పటి నుంచి నిరంతరం చంద్రుడి వైపు కదులుతుందని తెలిపింది.
Read Also: Beef : త్వరలోనే మార్కెట్లోకి ల్యాబ్ లో తయారు చేసిన బీఫ్
ఇక, జపాన్ స్నిపర్ మొదటి చంద్రుని మిషన్లో ల్యాండింగ్ చేయడానికి అత్యంత అధునాతన సాంకేతికతను ఉపయోగించింది. ఇది నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే ల్యాండ్ చేయబడుతుంది.. దాని స్థానంలో ఎలాంటి మార్పు ఉండదు. SLIM అనేది తేలికైన రోబోటిక్ ల్యాండర్.. ఈ మిషన్ను మూన్ స్నిపర్ అని కూడా పిలుస్తారు. ఈ మిషన్ విలువ రూ.831 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుందని జాక్సా తెలిపింది. నేడు జపాన్ పరిశోధన సంస్థ 20-నిమిషాల టచ్డౌన్ దశను ప్రారంభించనుంది.. చంద్రుడికి భూమధ్యరేఖకు దక్షిణంగా ఉన్న బిలం వాలుపై ఉన్న రెండు అథ్లెటిక్ ట్రాక్ల పరిమాణంలో ఉన్న సైట్లో దిగడానికి ప్రయత్నిస్తుంది.
Read Also: Top Headlines @ 1 PM : టాప్ న్యూస్
అయితే, చంద్రుని యొక్క సముద్రపు ఉత్తర భాగంలో జపాన్ యొక్క మూన్ మిషన్ స్నిపర్ ల్యాండ్ అయి.. పరిశోధన చేయనుంది. ఇక్కడ ఖనిజాలు, అంతర్గత విషయాలను ల్యాండర్ పరిశీలించనుంది. జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ (JAXA) SLIM ఒక ప్రయోగాత్మక సాంకేతికతను పరీక్షిస్తుంది. అయితే, ఇప్పటి వరకు రష్యా, అమెరికా, చైనా, భారతదేశం మాత్రమే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేశాయి. ఇవి కాకుండా ఏ ఇతర దేశం కూడా చంద్రుడి ఉపరితలంపై స్టాఫ్ట్ ల్యాండింగ్ చేయలేదు.. ఇక, జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా రెండుసార్లు చిన్న గ్రహశకలాలపై ల్యాండ్ చేసింది.. కానీ, చంద్రుని గురుత్వాకర్షణ కారణంగా వాటిపై ల్యాండింగ్ కొంచెం కష్టంగా మారింది. గత సంవత్సరం, రష్యా, జపాన్ స్టార్టప్ iSpace Inc కు చెందిన ఒక అంతరిక్ష నౌక చంద్రుని ఉపరితలంపై కూలిపోయింది.