Delhi attack plan: ఢిల్లీ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్న 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ఢిల్లీ, ముంబైతో పాటు దేశంలోని కీలక ప్రాంతాలపై దాడులు చేసేందుకు ప్రణాళిక చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అరెస్టయిన వ్యక్తుల్లో ఢిల్లీ, ముంబై, పంజాబ్కు చెందిన వ్యక్తులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. వీరి వద్ద నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు,మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అధికారులు చెబుతున్న దాని ప్రకారం, అరెస్ట్ అయిన వారు అణు కేంద్రాలు, ఎయిర్పోర్టులు, రైల్వే స్టేషన్లను, విద్యుత్ కేంద్రాలను టార్గెట్ చేసినట్లు తేలింది. భద్రతా సిబ్బందిపై దాడులు చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా ఈ ముఠాపై స్పెషల్ సెల్ నిఘా ఉంచింది. సరైన సమయంలో ఆపరేషన్ నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం విదేశీ హ్యాండ్లర్లు, నిధుల ఎక్కడి నుంచి వస్తున్నాయనే వివరాలతో పాటు, పాకిస్తాన్ నుంచి ఎవరు సహకరిస్తున్నారనే దానిపై విచారణ జరుగుతోంది.
