India DeepTech Market: భారతదేశం డీప్టెక్ రంగం గణనీయమైన వృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. రక్షణ ఆవిష్కరణలు, రోబోటిక్స్ విస్తరణ వంటి అంశాల కారణంగా 2030 నాటికి డీప్టెక్ మార్కెట్ విలువ 30 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకోనుందని రెడ్సీర్ స్ట్రాటజీ కన్సల్టెంట్స్ తాజా నివేదిక వెల్లడించింది. గత దశాబ్దంలో భారత రక్షణ బడ్జెట్ రెట్టింపు అయి USD 80 బిలియన్ దాటింది. దీంతో రక్షణ రంగంలో డీప్టెక్ వైపు భారీ పెట్టుబడులు మళ్లాయని నివేదిక చెబుతోంది. ఈ విస్తరణ అమెరికా, చైనా వంటి అగ్రదేశాల వృద్ధిరేటును కూడా అధిగమించింది.
Read Also: Ande Sri Death: హార్ట్ స్ట్రోక్తో అందెశ్రీ చనిపోయారు.. గాంధీ వైద్యుల డిక్లేర్
గత ఐదేళ్లలో భారతదేశం యొక్క డీప్టెక్ అవకాశాలు 2.5 రెట్లు పెరిగాయి, 2030 నాటికి అది USD 30 బిలియన్ల మార్కెట్గా మారనుంది. చైనా వెలుపల విశ్వసనీయ, తక్కువ ఖర్చుతో కూడిన ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్ అభివృద్ధి చెందుతోంది. 2025 నాటికి భారత డీప్టెక్ బేస్ విలువ USD 9–12 బిలియన్ ఉండవచ్చని అంచనా. రక్షణ, డీప్టెక్, గ్లోబల్ రోబోటిక్స్ రంగాల్లో వ్యయాలు ఈ వృద్ధికి దారితీస్తున్నాయి. ప్రపంచ రోబోటిక్స్ మార్కెట్ ప్రస్తుతం USD 60 బిలియన్, ఇది 2030 నాటికి USD 230 బిలియన్కి చేరవచ్చని నివేదిక అంచనా వేసింది. దీంట్లో భారత్ సుమారు USD 10 బిలియన్ అవకాశాన్ని పొందవచ్చని పేర్కొంది.
హ్యూమనాయిడ్ రోబోట్ల ఉత్పత్తి ఖర్చులు అమెరికా కంటే 73 శాతం తక్కువగా ఉండటం భారత్కు ప్రధాన ప్రయోజనంగా నిలుస్తోంది. దీనికి కారణం — తక్కువ కార్మిక ఖర్చులు, సమర్థవంతమైన లోకల్ ఏకీకరణ, ఖర్చు ఆప్టిమైజ్డ్ సోర్సింగ్ అని నివేదిక స్పష్టం చేసింది. రెడ్సీర్ ప్రకారం, తక్షణ అవకాశాలు స్వయంప్రతిపత్త వ్యవస్థలు (Autonomous Systems), AI ఆధారిత శిక్షణ టెక్నాలజీలు, ఎనర్జీ-డ్రివెన్ ఇన్నోవేషన్లు వంటి రంగాల్లో ఉన్నాయి. “డీప్టెక్ ఇకపై రేపటి లక్ష్యం కాదు – ఇది తదుపరి ఆర్థిక ఇంజిన్,” అని నివేదిక తేల్చింది. భారత్ రక్షణ–డీప్టెక్ పెట్టుబడులు పెట్టదగిన మరియు ఊహించదగిన రాబడులను తెచ్చే దిశగా ఉన్నాయని చెప్పుకొచ్చింది..
