Site icon NTV Telugu

Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్.. లక్షల కోట్ల సంపద ఆవిరి

Stockmarket

Stockmarket

పశ్చిమాసియా యుద్ధం దేశీయ మార్కె్ట్‌ను బెంబేలెత్తిస్తోంది. యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి మార్కెట్ ఘోరంగా దెబ్బతింటోంది. ఇప్పటికే భారీ నష్టాలను చవిచూసింది. ప్రస్తుతం యుద్ధం ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు. రోజురోజుకు హెచ్చరికలు.. బెదిరింపులతో మధ్యప్రాచ్యం తీవ్రత మరింత ముదురుతోంది. దీంతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇక సోమవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ చివరి దాకా అదే ఒరవడి కొనసాగించింది. అన్ని రంగాలు సూచీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. దీంతో పెట్టుబడిదారుల లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. దాదాపు రూ.13 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్లు నష్టపోయారు.

సెన్సెక్స్ 1,836 పాయింట్లు నష్టపోయి 72, 696 దగ్గర ముగియగా.. నిఫ్టీ 601 పాయింట్లు నష్టపోయి 22, 512 దగ్గర ముగిసింది. ఇక రూపాయి విలువ ఘోరంగా దెబ్బతింది. సోమవారం రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 93.97 దగ్గర సరికొత్త రికార్డు కనిష్ట స్థాయి దగ్గర ముగిసింది.

ఇక నిఫ్టీలో శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, జియో ఫైనాన్షియల్ అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, పవర్ గ్రిడ్ కార్ప్, టీసీఎస్ లాభపడ్డాయి. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్, పీఎస్‌యు బ్యాంక్ రంగాల సూచీలు ఒక్కొక్కటి 4 శాతం కంటే ఎక్కువగా పడిపోవడంతో అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.

Exit mobile version