Site icon NTV Telugu

IPL Tickets Price: క్రికెట్ లవర్స్ కు బిగ్ షాక్.. ఐపీఎల్ టిక్కెట్లపై 40 శాతం జీఎస్టీ.. కొత్త రేట్లు ఇవే

Ipl

Ipl

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీ కౌన్సిల్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. సామాన్యుడి నడ్డి విరుస్తున్న 12%, 28% పన్ను శ్లాబులను పూర్తిగా రద్దు చేసి, కేవలం 5%, 18% శ్లాబులను మాత్రమే కొనసాగించాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. విలాసవంతమైన వస్తువులపై 40% పన్ను విధించాలని నిర్ణయించింది. ఈ కొత్త, సరళమైన పన్ను విధానం ఈ నెల 22 నుంచే అమల్లోకి రానుంది. అయితే క్రికెట్ లవర్స్ కు మాత్రం బిగ్ షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లను చూడటానికి ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఐపీఎల్ టిక్కెట్లు ఇప్పుడు మునుపటి కంటే ఖరీదైనవిగా మారతాయి. సెప్టెంబర్ 3 (బుధవారం)న, ఐపీఎల్, ఇలాంటి పెద్ద క్రీడా ఈవెంట్ల టిక్కెట్లపై 40 శాతం జీఎస్టీ (వస్తువులు మరియు సేవల పన్ను) విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.

Also Read:Pawan Kalyan Flexi Controversy: ఫ్లెక్సీ వివాదం.. పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు సీఐ సీరియస్‌ వార్నింగ్..

గతంలో ఐపీఎల్ టిక్కెట్లపై 28 శాతం జీఎస్టీ విధించారు. ఇప్పుడు ఐపీఎల్ టిక్కెట్లను అత్యధిక పన్ను శ్లాబ్‌లో (40 శాతం) చేర్చారు. ఇందులో క్యాసినోలు, రేస్ క్లబ్‌లు, లగ్జరీ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ఈ నిర్ణయం తర్వాత, ఐపీఎల్ టిక్కెట్ల ధరపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. గతంలో, GST కలిపిన తర్వాత రూ. 500 ఐపీఎల్ టికెట్ రూ. 640 కి అందుబాటులో ఉండేది. ఇప్పుడు అది రూ. 700 కి అందుబాటులోకి వస్తుంది. అంటే మీరు రూ. 60 ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Also Read:Food Poisoning: పోలీస్ శిక్షణ కేంద్రంలో ఫుడ్ పాయిజనింగ్.. 170 మంది ట్రైనీ పోలీసులకు అస్వస్థత..!

అదేవిధంగా, రూ. 1000 టికెట్ ఇప్పుడు రూ. 1400 అవుతుంది. గతంలో ఇది రూ. 1,280 కి అందుబాటులో ఉండేది. అంటే మీరు రూ. 120 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. రూ. 2000 టికెట్ మొత్తం ధర ఇప్పుడు రూ. 2800 అవుతుంది. గతంలో ఇది GST కలిపిన తర్వాత రూ. 2,560 కి అందుబాటులో ఉండేది. అంటే మీరు రూ. 2000 టికెట్ కోసం రూ. 240 ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయ, ఇతర క్రికెట్ మ్యాచ్‌ల టిక్కెట్లపై 18 శాతం GST మునుపటిలాగే వర్తిస్తుంది. IPL, ప్రీమియం లీగ్‌లను మాత్రమే 40 శాతం పన్ను స్లాబ్‌లో ఉంచారు.

Exit mobile version