Ola Electric: ఓలా ఎలక్ట్రిక్ కు ప్రభుత్వం షాక్.. 75 షోరూమ్‌లు క్లోజ్..

  • ఓలా ఎలక్ట్రిక్ కు ప్రభుత్వం షాక్
  • 75 షోరూమ్‌లు క్లోజ్
  • 192 స్కూటర్లను అధికారులు స్వాధీనం
Ola

Ola

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇటీవల ఓలా ఈవీ బైక్ ను కూడా రిలీజ్ చేసింది. ఇలాంటి తరుణంలో ఓలా ఎలక్ట్రిక్ కు మహారాష్ట్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. 75 షోరూమ్ లను క్లోజ్ చేసింది. చెల్లుబాటు అయ్యే ట్రేడ్ సర్టిఫికేట్ లేకుండా పనిచేస్తున్న అన్ని ఓలా ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లను మూసివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం RTO విభాగాన్ని ఆదేశించింది. దాదాపు 75 ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్‌లు మూసివేసింది. 192 స్కూటర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read:Gudivada Amarnath: షెల్ కంపెనీలకు ప్రభుత్వ భూములను కట్టబెడుతున్నారు..

ఓలా ఎలక్ట్రిక్ మహారాష్ట్ర ప్రభుత్వంతో వివాదంలో చిక్కుకుంది. రాష్ట్ర జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఏప్రిల్ 16, 2025 నాటి ఇమెయిల్‌లో ఓలా ఎలక్ట్రిక్‌పై తీసుకున్న చర్య గురించి తెలియజేస్తూ మహారాష్ట్ర RTOకి షోకాజ్ నోటీసు జారీ చేశారు. RTO మహారాష్ట్రలోని దాదాపు 146 ఓలా ఎలక్ట్రిక్ షాపులను తనిఖీ చేసింది. ఇందులో 121 డీలర్‌షిప్‌లకు సెంట్రల్ ట్రేడ్ సర్టిఫికేట్ లేదని తేలింది. ఈ దర్యాప్తు తర్వాత, మహారాష్ట్ర రాష్ట్రంలో RTO కింద పనిచేస్తున్న ఏదైనా ఓలా డీలర్‌షిప్ చెల్లుబాటు అయ్యే ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండకపోతే మూసివేయాలని ఆదేశించారు. షోరూమ్ డీలర్‌షిప్ ద్వారా విక్రయించే వాహనాలను రాష్ట్రంలో నమోదు చేసుకోవడానికి అవసరమైన అధికారుల నుంచి ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

Also Read:Minister Anagani: తప్పు చేసిన వారు పీఎస్ఆర్ అయినా, పెద్దిరెడ్డి అయినా శిక్ష తప్పదు..

ఫిబ్రవరి 2025లో ఓలా ఎలక్ట్రిక్ 25,000 యూనిట్ల అమ్మకాలను క్లెయిమ్ చేసింది. రిజిస్ట్రేషన్లలో భారీ వ్యత్యాసం ఉంది. ఈ 25 వేల వాహనాల్లో 8,647 వాహనాలు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. దీని తరువాత, మార్చి 2025 నెలలో పూణే, ముంబై వంటి మహారాష్ట్రలోని ప్రధాన నగరాల్లో RTO విభాగం అనేక తనిఖీలు నిర్వహించింది. మహారాష్ట్ర రవాణా శాఖ ఓలా ఎలక్ట్రిక్‌కు నోటీసు పంపింది. ఆ కంపెనీ మహారాష్ట్రలోని తన అన్ని షాపులకు ట్రేడ్ సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియలో ఉందని ప్రతిస్పందించింది.