ప్రస్తుతం బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. గత 10 రోజులుగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్స్.. ఎప్పుడూ లేని విధంగా కొత్త గరిష్ఠాన్ని తాకాయి. బుధవారం (సెప్టెంబర్ 3) బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,06,970గా.. 22 క్యారెట్ల ధర రూ.98,050గా ట్రేడ్ అవుతోంది. ఈరోజు 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.880.. 22 క్యారెట్ బంగారం రూ.800 పెరిగింది. ఈ 10 రోజుల్లోనే ఏకంగా 5 వేలకు పైగా పెరగడం విశేషం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగారం లక్షా పది వేల రూపాయల చేరువకు వచ్చేసింది.
హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,06,970గా.. 22 క్యారెట్ల ధర రూ.98,050గా కొనసాగుతోంది. విశాఖ, విజయవాడలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.1,07,120గా.. 22 క్యారెట్ ధర రూ.98,200గా ట్రేడ్ అవుతోంది. ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు కంగారుపడి పోతున్నారు. ఇక దీపావళి నాటికి బంగారం ధరలు ఎలా ఉంటాయో అని టెన్షన్ పడుతున్నారు.
మరోవైపు వెండి ధర కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. గత ఐదు రోజులుగా వెండి పెడుతోంది. బులియన్ మార్కెట్లో కిలో వెండిపై ఈరోజు రూ.900 పెరిగి.. రూ.1,27,000గా నమోదైంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి లక్షా 37 వేలుగా ఉంది. బుధవారం ఉదయం 10 గంటల వరకు గుడ్ రిటర్న్స్ వెబ్సైట్లో నమోదైన గోల్డ్, సిల్వర్ ధరలు ఇవి. ప్రాంతాల వారీగా ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే.
