Site icon NTV Telugu

Father Kills Daughter: వీడింతకు తండ్రేనా.. ఎన్నికల్లో పోటీ కోసం కన్న కూతురు హత్య..!

Nzb

Nzb

Father Kills Daughter: నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ కోసం కన్న కూతుర్నే హత్య చేసాడో ఓ కసాయి తండ్రి. ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనతో తండ్రి పాండురంగ సొంత బిడ్డను కడతేర్చారు. ఎడపల్లి మండలం ARP క్యాంప్ నిజాం సాగర్ కెనాల్లో ఇటీవల బాలిక హత్య కేసులో విస్తూ పోయే నిజాలు బయటకు వచ్చాయి.

Read Also: Ram Charan- Upasana: మెగా జంట రామ్ చరణ్, ఉపాసనకు.. బన్నీ ఎమోషనల్ విషెస్

వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ముత్కేడ్ మండలం కేరురుకు చెందిన పాండురంగ రాబోయే పంచాయితీ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గా పోటీ చేయాలని సన్నాహాలు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు పిల్లల ఉంటే పోటీకి అనర్హుడు అని ప్రస్తుత సర్పంచ్ గణేష్ తో కలిసి ముగ్గురు పిల్లల్లో ఒకరి హత్య చేసేందుకు కుట్ర చేశాడు. ఇక, పెద్ద కూతురు ప్రాచీని.. ఎడపల్లికి తీసుకొచ్చి.. బతికి ఉండగా కెనాల్ లో తండ్రి పాండురంగా తోసేశాడు. ఇక, నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి ఆ బాలిక ఊపిరి ఆడక మృతి చెందింది. ఈ కేసులో మృతురాలు తండ్రి పాండురంగతో పాటు కేరూరు సర్పంచ్ గణేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Exit mobile version