Site icon NTV Telugu

Elephant in Tamil Nadu: తమిళనాడులో ఏనుగు భీభత్సం.. ఇద్దరు మహిళలు మృతి!

Elephant Hulchul In Tamilnadu

Elephant Hulchul In Tamilnadu

Two Women killed after Elephant attack in Tamil Nadu: తమిళనాడులో ఓ ఏనుగు భీభత్సం సృష్టించింది. పోలం పనులు చేసుకుంటున్న ఇద్దరు మహిళలను ఏనుగు తొక్కి చంపింది. మహిళలతో పాటు ఓ ఆవును కూడా ఏనుగు తొక్కి చంపింది. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ఒంటరి ఏనుగు భీభత్సంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగు భీభత్సంకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: Ravichandran Ashwin: అభిమానులకు శుభవార్త.. అశ్విన్‌ వచ్చేస్తున్నాడు!

హోసూరూ డెంకనికోట సమీపంలో పోలం పనులు చేసుకుంటున్న వసంతమ్మ, అశ్వతమ్మ అనే ఇద్దరు మహిళలను ఏనుగు తొక్కి చంపింది. దాంతో చుట్టుపక్కల వారు అక్కడినుంచి పరుగులు తీశారు. ఆపై ఓ ఆవును కూడా తొక్కి చంపింది. ఏనుగు చిత్తూరు సరిహద్దు గ్రామాల వైపు వెళ్లింది. దాంతో అటుగా ఉన్న గ్రామ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇద్దరు మహిళల మృతికి కారణం అటవీశాఖ నిర్లక్ష్యమే అని జాతీయ రహదారిపై గ్రామస్థులు ధర్నాకు దిగారు.

Exit mobile version