Site icon NTV Telugu

Earthquake : టర్కీలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.7 తీవ్రతతో..

Earthquake In Turkey

Earthquake In Turkey

Earthquake in Turkey: టర్కీలోని వాయువ్య ప్రావిన్స్ కనక్కలేలో 4.7 తీవ్రతతో నేడు భూకంపం సంభవించిందని డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ప్రెసిడెన్సీ (AFAD) తెలిపింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:39 గంటలకు భూకంపం సంభవించిందని ఈజీన్ జిల్లా కేంద్రంగా ఉందని AFAD సోమవారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X లో తెలిపింది. అయితే ఈ భూకంపంలో ప్రస్తుతం, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు నివేదించబడలేదు. మేము ఎమర్జెన్సీ కాల్ సెంటర్‌కి అందిన ప్రతి నివేదికను తెలియచేస్తామని ఇంటీరియర్ మినిస్టర్ అలీ యెర్లికాయ X లో చెప్పారు. ఆ దేశ వార్తా సంస్థ నివేదించిన విధంగా ఫీల్డ్ సర్వే కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలుస్తోంది.

Weather update: మరో ఐదు రోజుల భారీ వర్షాలు.. గుజరాత్, మహారాష్ట్ర, గోవాలకు రెడ్ అలర్ట్..!

పత్రికా నివేదికల ప్రకారం టర్కీ దేశంలోని అతిపెద్ద నగరమైన ఇస్తాంబుల్‌ లో కూడా ప్రకంపనలు కనిపించాయి. భూకంపాలను రిక్టర్ స్కేల్ ఉపయోగించి కొలుస్తారు. దీనిని రిక్టర్ మాగ్నిట్యూడ్ టెస్ట్ స్కేల్ అంటారు. భూకంపాలను రిక్టర్ స్కేలుపై 1 నుండి 9 వరకు కొలుస్తారు. భూకంపాన్ని దాని కేంద్రం నుండి అంటే.. భూకంప కేంద్రం నుండి కొలుస్తారు. భూకంపం సమయంలో భూమి లోపల నుండి విడుదలయ్యే శక్తి తీవ్రత దాని ద్వారా కొలుస్తారు. ఈ తీవ్రత భూకంపం తీవ్రతను నిర్ణయిస్తుంది.

Tirumala Tickets: శ్రీవారి భక్తులకు గుడ్‌ న్యూస్.. ఇవాళ ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ దర్శన టికెట్లు విడుదల

Exit mobile version