Site icon NTV Telugu

Breaking News: సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భూకంపం.. 5 సెకన్లు కంపించిన భూమి

Earth Quake

Earth Quake

సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భూకంపం వచ్చింది. న్యాల్కల్ మండలంలోని న్యాల్కల్, ముంగి గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. సాయంత్రం 4.30 గంటల సమయంలో భూమి కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో వారు ఇళ్లనుంచి భయంతో పరుగులు తీశారు. కాగా.. ఐదు సెకన్ల పాటు భూమి కంపించినట్లు అక్కడి జనాలు చెబుతున్నారు.

Exit mobile version