Earthquake: ఇండోనేషియా-నేపాల్‌లో భూకంపం

  • ఇండోనేషియా-నేపాల్‌లో భూకంపం
  • 5.9 తీవ్రతతో భూకంపం
Earthquakes2

Earthquakes2

ఇండోనేషియాలో మరోసారి భూకంపం సంభవించింది. ఇండోనేషియాలోని దక్షిణ సుమత్రాలో 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. భూకంపం 10 కిలోమీటర్ల (6.21 మైళ్ళు) లోతులో సంభవించిందని GFZ తెలిపింది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగ లేదు. అదే సమయంలో, నేపాల్‌లో కూడా స్వల్ప భూకంపం సంభవించింది. నేపాల్‌లో భూకంప తీవ్రత 4.3గా నమోదైంది. భూకంప కేంద్రం 29.36 డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 80.44 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద 10 కిలోమీటర్ల లోతులో ఉంది. ఈ భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు వెల్లడి కాలేదు.

Also Read:Coronavirus: విశాఖలో కోవిడ్ కేసు.. కాకినాడ జిజిహెచ్ లో కోవిడ్ అప్రమత్తత

×
×
Ad

నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం, ఇండోనేషియా-నేపాల్ తర్వాత.. తజికిస్తాన్‌లో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. తజికిస్తాన్‌లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. తజికిస్తాన్‌లో 3.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని NCS తెలిపింది. భూకంప కేంద్రం 10 కి.మీ లోతులో ఉంది.