దసరా వచ్చిందంటే చాలు కర్ణాటకలో వస్తాదులు పోటీలు జోరుగా సాగుతుంటాయి. అయితే.. దసరా మహోత్సవం సందర్భంగా కర్ణాటక ఎగ్జిబిషన్ అథారిటీ ప్రాంగణంలో నాద కుస్తీ జంట తయారీ కార్యక్రమాన్ని మంత్రి సోమశేఖర్ ప్రారంభించారు. ఆయనతో ఎంపీ ప్రతాప్ సింగ్, ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ, మేయర్ శివకుమార్, ఎస్పీ చేతన్, పలువురు పాల్గొన్నారు. దసరా సమీపిస్తున్నందున కర్ణాటకలోని మైసూరు ఈ సంవత్సరం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఆదివారం ఐకానిక్ నాద కుస్తీ కోసం జతకట్టడం, సాంప్రదాయ కుస్తీ పోటీలు ప్రారంభమయ్యాయి. అయితే.. దేశవ్యాప్తంగా చాలా మంది మల్లయోధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోటీల సమయంలో ప్రత్యర్థితో పోటీ పడేందుకు ఒక సీనియర్ రెజ్లర్ ఒక జూనియర్ రెజ్లర్తో జత చేయబడతాడు. వివిధ గరడి మేన్ల (రెజ్లింగ్ హౌస్లు) నుండి దాదాపు 200 మంది రెజ్లర్లు ఈ కార్యక్రమంలో కనిపించారు. వారు పోటీకి ముందు ఇతర రెజ్లర్లతో జతకట్టారు. మల్లయోధులు మాస్ స్విమ్మింగ్, స్టోన్ త్రో, జావెలిన్ త్రో వంటి ఇతర ఈవెంట్లలో కూడా పాల్గొన్నారు.
ದಸರಾ ಮಹೋತ್ಸವ : ನಾಡ ಕುಸ್ತಿ ಜೋಡಿ ಕಟ್ಟುವ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಚಾಲನೆ! ಕರ್ನಾಟಕ ವಸ್ತುಪ್ರದರ್ಶನ ಪ್ರಾಧಿಕಾರ ಆವರಣದಲ್ಲಿ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದ ನಾಡ ಕುಸ್ತಿ. ಸಚಿವ ಸೋಮಶೇಖರ್ರಿಂದ ಚಾಲನೆ. ಸಂಸದ ಪ್ರತಾಪ್ ಸಿಂಹ, ಶಾಸಕ ಜಿ.ಟಿ.ದೇವೇಗೌಡ, ಮೇಯರ್ ಶಿವಕುಮಾರ್, ಎಸ್.ಪಿ.ಚೇತನ್, ಹಲವರು ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. pic.twitter.com/Wy62hF2CzW
— Nannuru mysuru (@MysuruNannuru) September 18, 2022
