NTV Telugu Site icon

Kalki 2898 AD : కల్కి సినిమా చూసాక ప్రేక్షకులకు అలాంటి ఫీలింగ్ కలుగుతుంది : నాగ్ అశ్విన్

Nag Ashwin Jpeg

Nag Ashwin Jpeg

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించింది.ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ ,కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు నటించారు.ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోన్ ,దిశా పటాని హీరోయిన్స్ గా నటించారు.ఈ భారీ బడ్జెట్ మూవీని మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే ప్రముఖ హాలీవుడ్ మీడియా డెడ్లైన్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో కల్కి టీం పాల్గొన్నారు.కల్కి మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసారు.

Read Also : Krishana Chaitanya : గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా మొదట వారితో తీద్దాం అనుకున్నా.. కానీ..?

కల్కి సినిమాను గ్లోబల్ రేంజ్ ఆడియన్స్ కోసం తెరకెక్కించినట్లు ప్రభాస్ తెలిపారు.అందుకే ఈసినిమాకు ఇంత భారీ బడ్జెట్ కేటాయించినట్లు ప్రభాస్ చెప్పుకొచ్చారు.అయితే కల్కి సినిమా చుసిన ప్రేక్షకులు సరికొత్త అనుభూతి చెందుతారని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.నేను ఎక్కడున్నాను మళ్ళీ ఆ వింత ప్రపంచంలోకి వెళ్ళొచ్చా అని ఫీల్ అవుతారని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.తాను అవతార్ చూసినప్పుడు అలాంటి ఫీలింగ్ కలిగిందని ..హాలీవుడ్ స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా కల్కి విజువల్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు.