India Turkey: టర్కీకి భారత్ మరో దెబ్బ… టర్కిష్ ఎయిర్లైన్స్తో భాగస్వామ్యం రద్దు.. ఇండిగోకు కీలక ఆదేశాలు
- టర్కీకి భారత్ మరో దెబ్బ
- టర్కిష్ ఎయిర్లైన్స్తో భాగస్వామ్యం రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం టర్కీకి షాకుల మీద షాకులిస్తోంది. కేంద్రం ఇండిగోను టర్కిష్ ఎయిర్లైన్స్తో తన విమానాల లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లోగా ముగించాలని ఆదేశించింది. ఢిల్లీతో సహా భారత్ లోని తొమ్మిది కీలక విమానాశ్రయాలలో సేవలను నిర్వహించిన టర్కీ-సంబంధిత సంస్థ సెలెబి ఏవియేషన్కు భద్రతా అనుమతిని ప్రభుత్వం రద్దు చేసిన కొన్ని వారాల తర్వాత టర్కీకి మరో దెబ్బ తగిలేలా చేసింది భారత్.
Also Read:Operation Shield: పాకిస్తాన్ సరిహద్దులోని రాష్ట్రాల్లో నేడు మాక్ డ్రిల్.. వణుకుతున్న పాక్
Also Read
- Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
- Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
- Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
ఇండిగో ‘డమ్ప్ లీజు’ ఒప్పందాన్ని ఆగస్టు 31, 2025 నాటికి రద్దు చేస్తామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది. ప్రస్తుతం, ఇండిగో టర్కిష్ ఎయిర్లైన్స్ నుంచి డంప్ లీజుకు రెండు బోయింగ్ 777-300ER విమానాలను తీసుకొని ఢిల్లీ, ముంబై నుంచి ఇస్తాంబుల్కు విమానాలను నడుపుతోంది. వాస్తవానికి ఈ లీజు గడువు మే 31న ముగియాల్సి ఉండగా, ఇండిగో అభ్యర్థన మేరకు డీజీసీఏ దానిని మరో మూడు నెలలు పొడిగించింది. ఈ లీజును 6 నెలలు పొడిగించాలని ఇండిగో కోరింది. కానీ DGCA దానిని తిరస్కరించింది. తదుపరి పొడిగింపు ఇవ్వబడదని, ఇది చివరి అవకాశం అని రెగ్యులేటర్ స్పష్టం చేసింది.
Also Read:GT vs MI: చితకబాదిన హిట్మ్యాన్.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం..!
పాకిస్తాన్ పై, ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేయడాన్ని టర్కీ ఇటీవల విమర్శించింది. దీని కారణంగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో BCAS (బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ) టర్కిష్ కంపెనీ సెలెబి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ భద్రతా అనుమతిని కూడా రద్దు చేసింది. ఇది మాత్రమే కాదు, అనేక ట్రావెల్ ఏజెన్సీలు, ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్లు కూడా టర్కియేకు ప్రయాణించవద్దని సూచించాయి.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
-
Ketan Agarwal case: కేతన్ను చంపిన తర్వాత సియా చెప్పిన ‘‘తొలి అబద్ధం’’ ఇదే..
-
Delhi Court: ఆ టైమ్లో పరాయి పురుషుడితో మాట్లాడినంతమాత్రాన మహిళ చెడిపోయినట్టు కాదు.. కోర్టు సంచలన తీర్పు
-
Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
-
Ration Card New Rules: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్.. 80 కోట్ల మందికి లబ్ధి..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!