India Turkey: టర్కీకి భారత్ మరో దెబ్బ… టర్కిష్ ఎయిర్లైన్స్తో భాగస్వామ్యం రద్దు.. ఇండిగోకు కీలక ఆదేశాలు
- టర్కీకి భారత్ మరో దెబ్బ
- టర్కిష్ ఎయిర్లైన్స్తో భాగస్వామ్యం రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపరేషన్ సింధూర్ సమయంలో టర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో కేంద్రం టర్కీకి షాకుల మీద షాకులిస్తోంది. కేంద్రం ఇండిగోను టర్కిష్ ఎయిర్లైన్స్తో తన విమానాల లీజు ఒప్పందాన్ని మూడు నెలల్లోగా ముగించాలని ఆదేశించింది. ఢిల్లీతో సహా భారత్ లోని తొమ్మిది కీలక విమానాశ్రయాలలో సేవలను నిర్వహించిన టర్కీ-సంబంధిత సంస్థ సెలెబి ఏవియేషన్కు భద్రతా అనుమతిని ప్రభుత్వం రద్దు చేసిన కొన్ని వారాల తర్వాత టర్కీకి మరో దెబ్బ తగిలేలా చేసింది భారత్.
Also Read:Operation Shield: పాకిస్తాన్ సరిహద్దులోని రాష్ట్రాల్లో నేడు మాక్ డ్రిల్.. వణుకుతున్న పాక్
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
ఇండిగో ‘డమ్ప్ లీజు’ ఒప్పందాన్ని ఆగస్టు 31, 2025 నాటికి రద్దు చేస్తామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది. ప్రస్తుతం, ఇండిగో టర్కిష్ ఎయిర్లైన్స్ నుంచి డంప్ లీజుకు రెండు బోయింగ్ 777-300ER విమానాలను తీసుకొని ఢిల్లీ, ముంబై నుంచి ఇస్తాంబుల్కు విమానాలను నడుపుతోంది. వాస్తవానికి ఈ లీజు గడువు మే 31న ముగియాల్సి ఉండగా, ఇండిగో అభ్యర్థన మేరకు డీజీసీఏ దానిని మరో మూడు నెలలు పొడిగించింది. ఈ లీజును 6 నెలలు పొడిగించాలని ఇండిగో కోరింది. కానీ DGCA దానిని తిరస్కరించింది. తదుపరి పొడిగింపు ఇవ్వబడదని, ఇది చివరి అవకాశం అని రెగ్యులేటర్ స్పష్టం చేసింది.
Also Read:GT vs MI: చితకబాదిన హిట్మ్యాన్.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం..!
పాకిస్తాన్ పై, ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడి చేయడాన్ని టర్కీ ఇటీవల విమర్శించింది. దీని కారణంగా రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో BCAS (బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ) టర్కిష్ కంపెనీ సెలెబి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ భద్రతా అనుమతిని కూడా రద్దు చేసింది. ఇది మాత్రమే కాదు, అనేక ట్రావెల్ ఏజెన్సీలు, ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్లు కూడా టర్కియేకు ప్రయాణించవద్దని సూచించాయి.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!