NTV Telugu Site icon

CM Yogi Adityanath: యూపీ మహిళలకు సీఎం యోగి గుడ్ న్యూస్..

Cm Yogi Aditynath

Cm Yogi Aditynath

ఉత్తర్ ప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుభవార్త చెప్పారు. ఆగస్టు 19న రక్షాబంధన్‌ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోదరీమణులకు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గురువారం రాష్ట్రంలోని శాంతిభద్రతలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సీనియర్ ప్రభుత్వ స్థాయి అధికారుల సమక్షంలో జోన్, డివిజన్, రేంజ్ మరియు జిల్లా స్థాయిలో ముఖ్యమైన పోస్టులపై నియమించిన అధికారులతో సమీక్షించారు.

Read Also: Paris Olympic 2024: ఒలింపిక్స్ లో భారత హాకీ ప్రస్థానం ఇలా..

ఈ సమీక్షా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ఆగస్టు 18వ తేదీ రాత్రి నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈ విషయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో నాగ పంచమి, శ్రావణ సోమవారం, కాకోరి రైలు యాత్ర వార్షికోత్సవం, రక్షాబంధన్, చేహల్లు, జన్మాష్టమి వంటి పండుగలతో పాటు పోలీసు నియామక పరీక్ష వంటి ముఖ్యమైన పనులను కూడా నిర్వహిస్తామని సీఎం తెలిపారు. లా అండ్ ఆర్డర్ దృక్కోణంలో ఇది ఖచ్చితంగా సున్నితమైన సమయం అని.. ప్రతి జిల్లాకు చెందిన పోలీసులు మరియు స్థానిక యంత్రాంగం 24×7 అప్రమత్తంగా ఉండాలని అధికారులను కోరారు.

Read Also: PM Modi: బంగ్లాదేశ్ కొత్త ప్రధాని ముహమ్మద్ యూనస్‌కి మోడీ శుభాకాంక్షలు..

మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత
మహిళల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని సీఎం యోగి అన్నారు. రక్షాబంధన్ రోజు.. కొన్ని వికృత ఎలిమెంట్స్ వాతావరణాన్ని పాడుచేయడానికి ప్రయత్నించవచ్చు, అందుకే పోలీసు పెట్రోలింగ్‌ను పెంచండని అధికారులకు తెలిపారు. అందుకోసం అప్రమత్తంగా.. జాగ్రత్తగా ఉండాలని అధికారులకు చెప్పారు.