Site icon NTV Telugu

UP Video: సీఎం యోగిని కలిసిన చిన్నారి.. ఏం కోరిక కోరిందంటే..!

Up

Up

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చిన్నారులతో చాలా సరదాగా గడుపుతుంటారు. ఎక్కడికెళ్లినా చిన్నారులు కనిపించారంటే చాక్లెట్లు ఇస్తుంటారు. ఆ మధ్య ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఒక బుడ్డోడితో మాట్లాడుతూ ఏం కావాలని అడిగితే ముఖ్యమంత్రి చెవిలో ‘చిప్స్’ కావాలని అడిగాడు. ఇందుకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అయింది.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రతి సోమవారం లక్నోలో యోగి ఆదిత్యనాథ్ ‘‘జనతా దర్శన్’ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ప్రజలను నేరుగా కలిసి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఒక చిన్నారి వినతిపత్రం తీసుకుని ముఖ్యమంత్రిని కలిసేందుకు వచ్చింది. అర్జీ తీసుకున్న యోగి.. ఏం కావాలని అడిగితే పాఠశాల ప్రవేశం కల్పించేలా సాయం చేయాలని కోరింది. ఈ సందర్భంగా చిన్నారితో చాలా సేపు మాట్లాడి చాక్లెట్ ఇచ్చారు. సంభాషణ అనంతరం పాఠశాలలో ప్రవేశం లభించేలా చూడాలని అధికారులకు యోగి ఆదేశించారు.

యోగి ఆదిత్యనాథ్‌ను కలిసిన తర్వాత చిన్నారి తల్లి ఫరా ముషారఫ్ మాట్లాడుతూ.. ‘‘మా అమ్మాయికి లోరెటో కాన్వెంట్ స్కూల్‌లో ప్రవేశం కల్పించమని కోరడానికి ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చాము. ముఖ్యమంత్రి ముందు తమ కుమార్తె ఒక పద్యం వినిపించింది. ఆమెకు బడికి వెళ్లాలని చాలా ఆసక్తిగా ఉందని సీఎం అన్నారు. ఆమెకు ఆ పాఠశాలలో ప్రవేశం లభిస్తుందని హామీ ఇచ్చారు.’’ అని వెల్లడించింది. ఇక చిన్నారి అనాబి అలీ మాట్లాడుతూ. ‘‘నేను ముఖ్యమంత్రి యోగి గారిని కలిసి లోరెటో కాన్వెంట్ పాఠశాలలో నాకు ప్రవేశం కల్పించమని అభ్యర్థించాను.’’ అని తెలిపింది.

Exit mobile version