NTV Telugu Site icon

Explosion: ఇటుక బట్టీలో చిమ్నీ పేలి ఏడుగురు కూలీలు మృతి

Explosion

Explosion

Explosion: బీహార్‌లోని మోతిహారి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇటుక బట్టీలో చిమ్నీలో పేలిన ఘటనలో దాదాపు ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన రామ్‌గర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని నారిర్‌గిర్‌లో చోటుచేసుకుంది.

Pregnancy Women : కడుపునొప్పితో వచ్చిన గర్భవతి.. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసు బృందాలు, ఎస్టీఆర్‌ఎఫ్ బృందం సహాయక చర్యలు చేపట్టాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు ఏఎస్పీ రక్సుల్ తెలిపారు. పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.