Site icon NTV Telugu

Bihar Elections 2025: బీహార్ పోరులో కొత్త ట్విస్ట్! ఎన్నికల్లో ఎంట్రీ ఇచ్చిన తాంత్రిక పూజారులు..

Bihar Elections 2025

Bihar Elections 2025

Bihar Elections 2025: ఎన్నికల రణరంగంలో విజయ పతాకాన్ని ఎగరవేయడానికి అభ్యర్థులు అనేక ఎత్తుగడలు వేస్తుంటారు. కానీ ఈ రాష్ట్రంలో ఏకంగా పలువురు తాంత్రిక పూజారులను ఆశ్రయించినట్లు వార్తలు బయటికి రావడం కలకలం రేగుతుంది. ఈ ఘటన ఎక్కడ వెలుగు చూసిందని అనుకుంటున్నారు.. మహాకాళ నగరం, అన్ని కాలాలకు అధిపతి అయిన ఉజ్జయినిలో ఈ ఘటన బయటపడింది. ఈ ప్రాంతం శతాబ్దాలుగా తాంత్రిక అభ్యాసాలు, ఆధ్యాత్మిక సాధనలకు అత్యంత అనువైన ప్రదేశంగా గుర్తింపు పొందింది. అందుకే దీపావళి (కార్తీక అమావాస్య) రాత్రి ఉజ్జయినిలోని విక్రాంత్ భైరవ శ్మశానవాటిక స్థలంలో తాంత్రికులు, అభ్యాసకుల ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు సమాచారం.

READ ALSO: Naga Chaitanya : నాగచైతన్య, శోభిత దీపావళి సెలబ్రేషన్స్.. పిక్స్ చూశారా

విజయం సాధించడానికి తాంత్రిక పూజలు..
బీహార్ ఎన్నికల్లో విజయం సాధించడానికి అభ్యర్థులు ఇక్కడ తాంత్రిక ఆచారాలను నిర్వహిస్తున్నారని సమాచారం. ఈసందర్భంగా తంత్ర సాధకుడు జయవర్ధన్ భరద్వాజ్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో విజయం సాధించడానికి ఒక ప్రత్యేక ఆచారం ధంతేరస్ రాత్రి ప్రారంభమై, దీపావళి రాత్రి ముగుస్తుందని వివరించారు. ఈ ఆచారాన్ని ఉపయోగించుకొని కొంతమంది అభ్యర్థులు తమ విజయాన్ని నిర్ధారించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. వాస్తవానికి ఈ ప్రదేశం ఒకప్పుడు భైరవుడు స్వయంగా ధ్యాన స్థలంగా (దీనిని భైరవ్‌గఢ్ అని కూడా పిలుస్తారు) ఉండేదని సాధకులు చెబుతారు. ఈ ప్రదేశంలో చేసే తపస్సు, ఆచారాలు 100% విజయాన్ని నిర్ధారిస్తాయని వెల్లడించారు.

ప్రత్యేక కలయిక..
పౌరాణిక నమ్మకాల ప్రకారం.. కార్తీక అమావాస్య (దీపావళి) సంవత్సరంలో అత్యంత ప్రత్యేకమైన అమావాస్య. ఈ రాత్రి, కీర్తి, శ్రేయస్సు, సంపద, ఆధిపత్యాన్ని పొందడానికి దహన సంస్కారాలలో తంత్ర ఆచారాలు నిర్వహిస్తారు. ఈ సమయంలో భైరవ బాబా, కాళి, లక్ష్మీ దేవిని పూజించడంతో పాటు, సంపదకు దేవుడైన కుబేరుడు, గణేశుడిని కూడా పూజిస్తారు. ఉజ్జయిని శ్మశానవాటిక దేశంలోని ఐదు ప్రసిద్ధ శ్మశానవాటికలలో (కామాఖ్య, తారాపీఠ్, రాజ్రప్ప, త్రయంబకేశ్వర్) ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ తాంత్రిక పద్ధతులు ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాయని అనేక మంది నమ్ముతారు. కొంతమంది తాంత్రికులు గుడ్లగూబ బలి (తల్లి లక్ష్మీ గుడ్లగూబపై స్వారీ), తాబేలు ఆచారం, కోడి ఆచారం, రట్టి ఆచారం, గౌరీ-గణేష్ ఆచారం కూడా పాటిస్తారు. దీపావళి రాత్రి నగరం మొత్తం దీపాలతో ప్రకాశిస్తున్న సమయంలో, కొంతమంది సాధకులు శక్తి, సిద్ధి, లక్ష్మీ ప్రార్థనతో దైవత్వాన్ని కోరుకోవడానికి చీకటిలో మునిగిపోయారు. ఈ ఆచారాలను, తాంత్రిక పూజలను ఆసరాగా చేసుకొని పలువురు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులు వారి విజయాన్ని నిర్ధారించుకోడానికి పూజల్లో కూర్చొన్నట్లు సమాచారం.

READ ALSO: Bihar Elections 2025: బీహార్‌ రాజకీయాల్లో బాంబు పేల్చిన పప్పు యాదవ్..

Exit mobile version