తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీలు ప్రచారంలో మునిగితేలుతున్నాయి.. ఇక, సామాన్యుడికి అధికారం.. సామజిక సమన్యాయం దిశగా తెలంగాణ ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ).. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో బీసీవై దూసుకెళ్తుంది.. పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అభ్యర్థుల ఎంపిక సహా ఇతర వ్యవహారాల్లో తలమునకలై ఉన్నారు.. ఈ క్రమంలోనే ఎన్నికల్లో అత్యంత కీలకమైన “ఎన్నికల మేనిఫెస్టో”ను ఆ పార్టీ విడుదల చేసింది. 18 కీలక అంశాలతో రూపొందిన ఈ మేనిఫెస్టోలో హైదరాబాద్ పై సంచలన హామీ ద్వారా ఈ పార్టీ తేలానగన్ రాజకీయాల్లో పెను సంచలనానికి తెరతీసింది. ”ప్రతీ మాటను అమలు చేసి నవ, యువ తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తాం.. ప్రతి ఒక్కరి ఆశలు నెరవేర్చి, ఆదర్శనీయంగా నిలుపుతాం..” అంటూ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు.
ఇక, మ్యానిఫెస్టో పూర్తి అంశాలు కింద పేర్కొనబడ్డాయి..