RRB Group D: రైల్వేలో 22,000 గ్రూప్ డి పోస్టులు.. కొత్త అప్లికేషన్ డేట్ ఇదే

  • రైల్వేలో 22,000 గ్రూప్ డి పోస్టులు
  • దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభమవుతుంది
  • 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి
Trains

Trains

రైల్వే గ్రూప్ డి రిక్రూట్‌మెంట్ 2026 కోసం సిద్ధమవుతున్న నిరుద్యోగులకు బిగ్ అప్‌డేట్. జనవరి 21న ప్రారంభం కావాల్సిన 22,000 ఖాళీగా ఉన్న గ్రూప్ డి లెవల్ 1 పోస్టుల దరఖాస్తు ప్రక్రియ ఇప్పుడు వాయిదా పడింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) జారీ చేసిన సవరించిన నోటిఫికేషన్ ప్రకారం, ఈ నియామకానికి దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 2, 2026. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 22,000 గ్రూప్ డి పోస్టుల భర్తీకి రైల్వే శాఖ షార్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 36 సంవత్సరాలు మించకూడదు. రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన వారికి నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఈ నియామకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పరీక్షలో పాల్గొని ఎంపిక కావాలి.

Also Read: Trump: మిత్రదేశాలతో చెడుతున్న మైత్రి.. ఫ్రాన్స్‌పై 200 శాతం సుంకం విధిస్తానని ట్రంప్ వార్నింగ్

ఈ పరీక్షలో అవసరమైన కటాఫ్ మార్కులను సాధించిన అభ్యర్థులు నియామక ప్రక్రియ తదుపరి దశ అయిన ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET)కి అర్హులు అవుతారు. PET తర్వాత, అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ లో పాల్గొనవలసి ఉంటుంది. అన్ని దశల తర్వాత, అభ్యర్థుల తుది జాబితా విడుదల చేస్తారు. జనరల్, OBC, EWS అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు రూ.500 దరఖాస్తు ఫీజును చెల్లించాలి. SC/ST, PH/EBC, అన్ని వర్గాల మహిళా అభ్యర్థులకు రూ.250 ఫీజు చెల్లించాలి. నోటిఫికేషన్ ప్రకారం, ఈ నియామకానికి దరఖాస్తులు జనవరి 21, 2026 నుండి ప్రారంభమవుతాయి. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక పోర్టల్, rrbapply.gov.in ని సందర్శించాల్సి ఉంటుంది.