ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను తాజాగా ప్రకటించింది. మార్చి 27వ తేదీన జరిగిన రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి.. రికార్డు స్థాయిలోనే కేవలం 27 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫలితాలు విడుదల చేయడం విశేషమే. ఇక గ్రూప్ వన్ పరీక్షకి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,881 మంది అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకొనగా., పరీక్ష రాసిన వాళ్లలో కేవలం 4,496 మందిని గ్రూప్ 1 మెయిన్స్ కు అర్హత సాధించారు అభ్యర్థులు.
ఇక గత సంవత్సరం డిసెంబర్ 08న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా 81 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక ఈ పరిక్ష నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. 2024 సెప్టెంబర్ 02, 09 తేదీల మధ్య మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉందని మీడియా పూర్వకంగా ఏపీపీఎస్సీ తెలిపింది.
ఇక ఈ నోటిఫికేషన్ లో విడుదల చేసిన పోస్టుల వివరాలు చూస్తే..
ఏపీ సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9,
ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18; డీఎస్పీ (సివిల్) 26,
రీజనల్ ట్రాన్స్పోర్టు ఆఫీసర్ 6,
కోఆపరేటివ్ సర్వీసెస్లో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5,
జిల్లా ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ 4,
అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3,
జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3,
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2,
జైళ్ళ శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్,
జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్,
మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II,
అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.