గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కొనసాగుతోంది. ఇప్పటికే పలు నామినేటెడ్ స్థానాలను భర్తీ చేసిన ప్రభుత్వం.. తాజాగా మరికొన్ని పదవులను భర్తీ చేసింది. ఏపీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (ఆప్కాబ్) ఛైర్మన్గా మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును నియమిస్తూ ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలానే ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (డీసీసీబీ) ఛైర్మన్గానూ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ప్రకాశం జిల్లా కో ఆపరేటీవ్ బ్యాంక్ (డీసీసీబీ) ఛైర్మన్గా కామేపల్లి సీతారామయ్య నియమితులయ్యారు. కాకినాడ జిల్లా కో ఆపరేటీవ్ బ్యాంక్ ఛైర్మన్గా తుమ్మల రామస్వామి నియమితులయ్యారు. ఏలూరు జిల్లా డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) ఛైర్మన్గా చాగంటి మురళీ కృష్ణ, ప్రకాశం జిల్లా డీసీఎంఎస్ ఛైర్మన్గా కసిరెడ్డి శ్యామల, కాకినాడ డీసీఎంఎస్ ఛైర్మన్గా పిచ్చేటి చంద్రమౌళిని ప్రభుత్వం నియమించింది.