దేశంలో పాల ధరలకు రెక్కలు. ఏడాది కాలంగా పెరుగుతూనే పోతున్న పాల ధరలు మరోసారి పెరిగాయి. వారి పాల ధరను పెంచుతున్నట్టు అమూల్ సంస్థ ప్రకటించింది. ధరల పెంపు నేటి (ఫిబ్రవరి 3) నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. తాజా నిర్ణయంతో పాల ధరలు లీటరుకు గరిష్ఠంగా రూ. 3 పెరిగాయి. “అమూల్ పౌచ్ మిల్క్ (అన్ని రకాలు) ధరలను సవరించాం. 2023 ఫిబ్రవరి 3 ఉదయం నుంచి ఈ ధరలు అమల్లోకి వస్తాయి” అని అమూల్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.
అమూల్ పాల ధరలు- ప్రస్తుత రేట్లు.
ప్రాడక్టు ధర
అమూల్ తాజా 500ఎంఎల్ 27
అమూల్ తాజా 1 లీటరు 54
అమూల్ తాజా 2 లీటర్లు 108
అమూల్ తాజా 6 లీటర్లు 524
అమూల్ తాజా 180ఎంఎల్ 10
అమూల్ గోల్డ్ 500ఎంఎల్ 33
అమూల్ గోల్డ్ 1 లీటర్ 66
అమూల్ గోల్డ్ 6 లీటర్లు 396
అమూల్ కౌ మిల్క్ 500ఎంఎల్ 28
అమూల్ కౌ మిల్క్ 1 లీటర్ 56
అమూల్ ఏ2 బఫెల్లో మిల్క్ 500ఎంఎల్ 35
అమూల్ ఏ2 బఫెల్లో మిల్క్ 1 లీటర్ 70
అమూల్ ఏ2 బఫెల్లో మిల్క్ 6 లీటర్లు 420
వరుసగా పెరుగుతూ..
పాల ధరలు దేశంలో గత 10 నెలల్లోనే రూ. 12 పెరిగాయి. అంతకుముందు ఏడేళ్ల వరకు పాల ధరల్లో ఒక్క రూపాయి కూడా మార్పు రాలేదు. 2013- 2014 మధ్యలో పాల ధరలు లీటరుకు రూ. 8 పెరిగాయి. ఇక వేసవిలో పాల ఉత్పత్తి ప్రతి ఏటా తగ్గుతుంది. డిమాండ్ అందుకోవాలంటే.. పాల సంస్థలు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అందుకే.. రానున్న రోజుల్లో పాల ధరలు మరింత పెరుగుతాయని అంచనాలు ఉన్నాయి. మరో పాల ఉత్పత్తి సంస్థ మదర్ డెయిరీ కూడా ధరలను పెంచుతూ వస్తోంది. 2022 మార్చ్ 5 నుంచి డిసెంబర్ 27 మధ్యలో ఈ డెయిరీ పాల ధరలు లీటరుకు రూ. 57 నుంచి రూ.66కి చేరాయి. అంటే రూ. 6 పెరిగింది.