UPI New Rule: యూపీఐ యూజర్లకు అలర్ట్.. జూన్ 16 నుంచి కొత్త రూల్!

  • యూపీఐ యూజర్లకు అలర్ట్
  • జూన్ 16 నుంచి కొత్త రూల్
  • UPI చెల్లింపులు మరింత వేగంగా మారబోతున్నాయి
Upi

Upi

డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేసింది. ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్స్ తో కోట్లాది రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. యూజర్లకు సేవలు మరింత చేరువ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. జూన్ 16 నుంచి కొత్త రూల్ ను అమలు చేయబోతోంది. UPI చెల్లింపులు మరింత వేగంగా మారబోతున్నాయి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవను వేగవంతంగా, మెరుగ్గా చేయడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఒక ప్రత్యేక మార్పును చేసింది. లావాదేవీ స్టేటస్ తనిఖీ చేయడానికి, చెల్లింపు చేయడానికి రెస్పాన్స్ టైమ్ ప్రస్తుత 30 సెకన్ల నుంచి కేవలం 15 సెకన్లకు తగ్గించబడుతుంది.

Also Read:Ambati Rambabu: జగన్ అమరావతిని అభివృద్ధి చేద్దామంటే కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారు..

ఈ మార్పు UPI ద్వారా డబ్బు పంపడం, స్వీకరించడం ప్రక్రియను వినియోగదారులకు చాలా వేగంగా, మరింత సమర్థవంతంగా చేస్తుందని భావిస్తున్నారు. ఏప్రిల్ 26న జారీ చేసిన సర్క్యులర్‌లో, జూన్ 16, 2025 నుంచి కొత్త ప్రాసెసింగ్ నియమాలను అమలు చేయాలని NPCI అన్ని బ్యాంకులు, చెల్లింపు యాప్‌లను ఆదేశించింది. UPI ప్రతి నెలా దాదాపు రూ.25 లక్షల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది. ఈ వృద్ధికి అనుగుణంగా, వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి, కొత్త ప్రతిస్పందన సమయానికి అనుగుణంగా వారి వ్యవస్థలను నవీకరించమని NPCI బ్యాంకులు, చెల్లింపు సేవా ప్రదాతలను (PSPలు) కోరింది.