Site icon NTV Telugu

Adivi Sesh: నా సినిమాలతో అందరూ బాగుపడ్డారు.. అడివి శేష్ ఎమోషనల్!

Adavishesh

Adavishesh

వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న హీరో అడివి శేష్. తన తదుపరి చిత్రం ‘డెకాయిట్’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మృణాల్ ఠాకూర్‌తో ఆయన కెమిస్ట్రీ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ కానుంది. ఈ చిత్రంతో ఏప్రిల్ 10న విడుదల కాబోతున్న తరుణంలో శేష్ వరుస ప్రమోషన్స్ లో పాల్గోంటున్నారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణంలోని కీలక విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన సినిమాలను నమ్మి పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు ఇప్పటివరకు నష్టాలు రాలేదని ఆయన గర్వంగా చెప్పుకొచ్చారు.

Also Read : Adah Sharma:సైజు అడిగిన నెటిజన్.. షాకిచ్చిన అదా శర్మ వైరల్ రిప్లై!

‘ఇప్పటివరకు నాతో పని చేసిన ప్రొడ్యూసర్స్ అందరూ లాభాలు గడించారు. వాళ్ళు పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం జరిగిందని నేను నమ్ముతున్నాను’ అని శేష్ పేర్కొన్నారు. కేవలం నటుడిగానే కాకుండా, స్క్రిప్ట్ విషయంలో కూడా శేష్ తీసుకునే జాగ్రత్తలే ఆయన సినిమాల మినిమమ్ గ్యారెంటీ సక్సెస్‌కు కారణమని ఇండస్ట్రీ టాక్. అలాగే తన కెరీర్‌లో మర్చిపోలేని సినిమా గురించి ప్రస్తావిస్తూ.. “గూఢచారి నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ వల్లే ఈరోజు నేను ఇలాంటి భారీ ప్రాజెక్టులు చేయగలుగుతున్నాను’ అని ఎమోషనల్ అయ్యారు. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపు శేష్‌ను కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఒక నమ్మకమైన హీరోగా నిలబెట్టింది.

Exit mobile version