Lightning In Football Match: లైవ్ మ్యాచ్లో పిడుగుపాటు.. ఆటగాడు మృతి (వీడియో)
- ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఒక్కసారిగా పిడుగుపాటు.
- ఆటగాడు మృతి.
- రిఫరీ సహా పలువురు ఆటగాళ్లకు తీవ్రంగా గాయాలు.
Lightning In Football Match: ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఓ ఆటగాడు చనిపోయాడు. అలాగే రిఫరీ సహా పలువురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆటగాళ్లను, రిఫరీని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం నాడు జరిగిన ఈ ఘటనతో క్రీడా ప్రపంచంలో విషాద ఘటనగా పేర్కోవచ్చు. ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా.. మైదానంలో ఒక్కసారిగా పిడుగు పడింది. పిడుగు పాటు కారణంగా ఒక ఆటగాడు మరణించాడు. అంతేకాకుండా, రిఫరీ సహా పలువురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: Virat Kohli Birthday: విరాట్ కోహ్లీపై అభిమానం.. సాగర తీరంలో సైకత శిల్పం!
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
తీవ్రంగా గాయపడిన ఆటగాళ్లను, రిఫరీని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘటన పెరూలో జరిగింది. నవంబర్ 3న, పెరూలోని చిల్కాలో రెండు దేశీయ క్లబ్లు జువెంటుడ్ బెల్లావిస్టా, ఫామిలియా చొక్కా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మ్యాచ్ ప్రథమార్థం జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో జువెంటుడ్ బెల్లావిస్టా మ్యాచ్లో 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ సమయంలో వాతావరణం మరింత దిగజారడంతో.. రెఫరీ విజిల్ వేసి గేమ్ను నిలిపివేశాడు. అలాగే ఆటగాళ్లను మైదానం వీడాల్సిందిగా కోరారు. ఈ సమయంలో ఆటగాళ్లు వెళ్లిపోతుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ మెరుపు 39 ఏళ్ల ఆటగాడు జోస్ హ్యూగో డి లా క్రూజ్ మెసాపై పడింది. దాంతో అతడు చనిపోయాడు. మెరుపు కారణంగా, రిఫరీతో సహా 5 మంది ఆటగాళ్లు కలిసి మైదానంలో పడిపోయారు.
In Peru, a soccer player died after being struck by lightning during a match
The tragedy occurred on November 3 during a match between clubs Juventud Bellavista and Familia Chocca, held in the Peruvian city of Huancayo.
During the game, a heavy downpour began and the referee… pic.twitter.com/yOqMUmkxaJ
— NEXTA (@nexta_tv) November 4, 2024
ఈ ప్రమాదంలో 40 ఏళ్ల గోల్ కీపర్ జువాన్ చోకా తీవ్రంగా కాలిపోయాడు. అతని శరీరంపై కాలిన గాయాలున్నాయి. మెరుపు దాడి తర్వాత, మైదానంలో పడిపోయిన ఆటగాళ్లలో ఒకరిద్దరు లేచేందుకు ప్రయత్నించారు. గాయపడిన ఆటగాళ్లంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిడుగుపాటుకు ఫుట్బాల్ క్రీడాకారుడు మృతి చెందడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోనేషియాలోని పశ్చిమ జావాలోని సిలివాంగి స్టేడియంలో స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. అప్పుడు 35 ఏళ్ల సెప్టెన్ రహరాజా అకస్మాత్తుగా పిడుగుపాటు కారణంగా మరణించాడు. దీంతో రహరాజుకు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!