Lightning In Football Match: లైవ్ మ్యాచ్లో పిడుగుపాటు.. ఆటగాడు మృతి (వీడియో)
- ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఒక్కసారిగా పిడుగుపాటు.
- ఆటగాడు మృతి.
- రిఫరీ సహా పలువురు ఆటగాళ్లకు తీవ్రంగా గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lightning In Football Match: ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా మైదానంలో ఒక్కసారిగా పిడుగు పడింది. దీంతో ఓ ఆటగాడు చనిపోయాడు. అలాగే రిఫరీ సహా పలువురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆటగాళ్లను, రిఫరీని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం నాడు జరిగిన ఈ ఘటనతో క్రీడా ప్రపంచంలో విషాద ఘటనగా పేర్కోవచ్చు. ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా.. మైదానంలో ఒక్కసారిగా పిడుగు పడింది. పిడుగు పాటు కారణంగా ఒక ఆటగాడు మరణించాడు. అంతేకాకుండా, రిఫరీ సహా పలువురు ఆటగాళ్లు తీవ్రంగా గాయపడ్డారు.
Also Read: Virat Kohli Birthday: విరాట్ కోహ్లీపై అభిమానం.. సాగర తీరంలో సైకత శిల్పం!
Also Read
- Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
తీవ్రంగా గాయపడిన ఆటగాళ్లను, రిఫరీని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషాద ఘటన పెరూలో జరిగింది. నవంబర్ 3న, పెరూలోని చిల్కాలో రెండు దేశీయ క్లబ్లు జువెంటుడ్ బెల్లావిస్టా, ఫామిలియా చొక్కా మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మ్యాచ్ ప్రథమార్థం జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో జువెంటుడ్ బెల్లావిస్టా మ్యాచ్లో 2-0 ఆధిక్యంలో ఉంది. ఈ సమయంలో వాతావరణం మరింత దిగజారడంతో.. రెఫరీ విజిల్ వేసి గేమ్ను నిలిపివేశాడు. అలాగే ఆటగాళ్లను మైదానం వీడాల్సిందిగా కోరారు. ఈ సమయంలో ఆటగాళ్లు వెళ్లిపోతుండగా ఒక్కసారిగా పిడుగు పడింది. ఈ మెరుపు 39 ఏళ్ల ఆటగాడు జోస్ హ్యూగో డి లా క్రూజ్ మెసాపై పడింది. దాంతో అతడు చనిపోయాడు. మెరుపు కారణంగా, రిఫరీతో సహా 5 మంది ఆటగాళ్లు కలిసి మైదానంలో పడిపోయారు.
In Peru, a soccer player died after being struck by lightning during a match
The tragedy occurred on November 3 during a match between clubs Juventud Bellavista and Familia Chocca, held in the Peruvian city of Huancayo.
During the game, a heavy downpour began and the referee… pic.twitter.com/yOqMUmkxaJ
— NEXTA (@nexta_tv) November 4, 2024
ఈ ప్రమాదంలో 40 ఏళ్ల గోల్ కీపర్ జువాన్ చోకా తీవ్రంగా కాలిపోయాడు. అతని శరీరంపై కాలిన గాయాలున్నాయి. మెరుపు దాడి తర్వాత, మైదానంలో పడిపోయిన ఆటగాళ్లలో ఒకరిద్దరు లేచేందుకు ప్రయత్నించారు. గాయపడిన ఆటగాళ్లంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పిడుగుపాటుకు ఫుట్బాల్ క్రీడాకారుడు మృతి చెందడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇండోనేషియాలోని పశ్చిమ జావాలోని సిలివాంగి స్టేడియంలో స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ జరిగింది. అప్పుడు 35 ఏళ్ల సెప్టెన్ రహరాజా అకస్మాత్తుగా పిడుగుపాటు కారణంగా మరణించాడు. దీంతో రహరాజుకు గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
-
PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!