Yemen: యెమెన్‌లో విషాదం.. పడవ బోల్తా.. 49 మంది మృతి

  • యెమెన్‌లో విషాద
  • వలసదారుల పడవ బోల్తా
  • 49 మంది మృతి
  • 140 మంది గల్లంతు పడవలో సోమాలియాలు
  • ఇథియోపియన్‌‌లు గల్ఫ్‌కు వలస వెళ్తుండగా ఘటన
Boat

Boat

యెమెన్ సమీపంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. వలసదారులతో వెళ్తున్న పడవ బోల్తా పడి 49 మంది మృతిచెందారు. మరో 140 మంది తప్పిపోయారు. ఈ మేరకు అంతర్జాతీయ వలసల సంస్థ (IOM) తెలిపింది. దాదాపు 260 మంది సోమాలియాలు, ఇథియోపియన్‌లతో గల్ఫ్ ఆఫ్ అడెన్ మీదుగా పడవ వెళ్తుండగా సోమవారం మునిగిపోయినట్లు సమాచారం. సెర్చ్ ఆపరేషన్ చేసి 71 మందిని రక్షించారు.

ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణకు స‌మాచార క‌మిష‌న‌ర్లు.. ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

×
×
Ad

ఆఫ్రికాలో పేదరికం నుంచి తప్పించుకోవడానికి మరియు పని కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లడానికి వలసదారులు ప్రయత్నిస్తుంటారు. అలా వలసదారులు యెమెన్ మీదగా తరచుగా వెళ్లే మార్గాలలో ఒకటి. యెమెన్ ఒక దశాబ్దానికి పైగా రక్తపాత అంతర్యుద్ధంలో మునిగిపోయింది.

ఇది కూడా చదవండి: Rainy Season : వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.. ఈ నియమాలు పాటించండి