తమిళనాడు మాదిరిగా పశ్చిమ బెంగాల్లోనూ భారీ పోలింగ్ నమోదవుతోంది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా ఓటర్లు తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు 18.76 శాతం ఓటింగ్ నమోదైంది. 16 జిల్లాల్లోని 152 స్థానాల్లో తొలి దశ పోలింగ్ జరుగుతోంది. మేదినీపూర్లో అత్యధికంగా 20.51 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యల్పంగా మాల్దాలో 16.96 శాతం ఓటింగ్ నమోదైంది.
అయితే పలు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ముర్షిదాబాద్లో హుమాయున్ కబీర్ పార్టీ కార్యకర్తలు నాటు బాంబు విసిరారని ఓ మహిళ ఆరోపించింది. బాధితుల్లో ఒకరు మాట్లాడుతూ. ‘‘నిన్న రాత్రి సుమారు 8 గంటలకు నేను నమాజ్ చేయడానికి బయటకు వచ్చాను… నేను నిలబడి ఉన్నాను… ఇద్దరు అబ్బాయిలు వచ్చి నా కాలి దగ్గర బాంబు విసిరారు. హుమాయున్ కబీర్ పార్టీ కార్యకర్తలు ఈ పని చేశారు.’’ అని అన్నారు.
9 గంటల పోలింగ్..
అలీపుర్దువార్-17.70 శాతం
బంకురా-20.20 శాతం
బీర్భూమ్ – 19.01 శాతం
కూచ్బెహార్ – 17.56 శాతం
దక్షిణ దినాజ్పూర్-18.81 శాతం
డార్జిలింగ్ – 18.80 శాతం
జల్పైగురి – 18.50 శాతం
ఝార్గ్రామ్ – 19.84 శాతం
కాలింపాంగ్ – 18.74 శాతం
మాల్దా – 16.96 శాతం
ముర్షిదాబాద్ – 18.88 శాతం
పశ్చిమ బర్ధమాన్ – 19.00 శాతం
పశ్చిమ మేదినిపూర్ – 20.51 శాతం
పూర్బో మేదినిపూర్ – 18.81 శాతం
పురూలియా – 17.83 శాతం
ఉత్తర దినాజ్పూర్ – 17.54 శాతం
#WATCH | West Bengal Assembly Elections 2026 | An argument broke out between supporters of TMC and BJP candidate from Siliguri assembly constituency, Sankar Ghosh, at Jagadish Chandra Vidyapith, Booth Number-26/237, in Siliguri. pic.twitter.com/Wmre38QORw
— ANI (@ANI) April 23, 2026
#WATCH | West Bengal Elections 2026 | A scuffle breaks out between TMC workers and Aam Janata Unnayan Party (AUJP) founder Humayun Kabir in Murshidabad.
Humayun Kabir is visiting the area where a crude bomb hurling incident was reported yesterday. pic.twitter.com/RTrRzg2eMr
— ANI (@ANI) April 23, 2026
