NTV Telugu Site icon

Janmashtami: జన్మాష్టమి వేడుకల్లో అపశ్రుతి.. రద్దీ కారణంగా ఊపిరాడక ఇద్దరు మృతి

Mathura Temple

Mathura Temple

Janmashtami: శుక్రవారం జన్మాష్టమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని మధురలో గల ఓ ఆలయంలో జన్మాష్టమి వేడుకల సందర్భంగా రద్దీ కారణంగా ఇద్దరు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. బాంకే బిహారీ ఆలయంలో అర్ధరాత్రి వేడుకల సందర్భంగా ఈ ఘటన జరిగినట్లు తెలిపారు.

“జన్మాష్టమి శుభ సందర్భంగా భక్తుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగింది. హారతి సమయంలో ఒక్కసారిగా ప్రజలు కాంప్లెక్స్‌కు చేరుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఈ సమయంలో జరిగిన తోపులాటలో ఇద్దరు భక్తులు ఊపిరాడక మరణించారు.” అని మధురలోని సీనియర్ పోలీసు అధికారి అభిషేక్ యాదవ్ చెప్పారు. ఆరుగురికి కూడా గాయాలయ్యాయని.. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.

Uttarakhand: డెహ్రాడూన్‌ను తాకిన క్లౌడ్‌బరస్ట్.. రంగంలోకి ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు

మధుర శ్రీకృష్ణుని జన్మస్థలంగా పరిగణించబడుతుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం మధురలోని కృష్ణ జన్మభూమి ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ఆధ్యాత్మిక, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రోత్సహించడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.